News November 19, 2025
తిరుపతి రైతులకు నేడు నగదు జమ

తిరుపతి జిల్లా రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నగదు ఇవాళ విడుదల కానుంది. జిల్లాలోని 1,54, 908 మంది రైతులకు రూ.104 కోట్లు బుధవారం జమ చేయనున్నారు. కడప జిల్లా నుంచి సీఎం చంద్రబాబు నగదు విడుదల చేస్తారు. తిరుపతి జిల్లాలో ప్రస్తుతం వరినాట్లు మొదలయ్యాయి. వీరికి ఈ నగదు ఎంతగానో ఉపయోగపడనుంది.
Similar News
News January 18, 2026
2026 దావోస్ సమ్మిట్ థీమ్ ఇదే!

‘ఎ స్పిరిట్ ఆఫ్ డైలాగ్’ థీమ్తో 2026 దావోస్ సమ్మిట్ జరగనుంది. ప్రపంచంతో పోటీ పడేందుకు అవసరమైన సహకారం, ఆవిష్కరణలు, స్థిరమైన వృద్ధిపై ప్రధానంగా చర్చిస్తారు. ప్రతి ఏడాది JANలో నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సమావేశాలను 1971లో జర్మన్ ఎకనామిక్ సైంటిస్ట్ ప్రొఫెసర్ క్లాస్ ష్వాబ్ స్టార్ట్ చేశారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, పర్యావరణ సమస్యలు, పరిష్కారాలపై చర్చకు వేదికగా సమ్మిట్ నిర్వహిస్తున్నారు.
News January 18, 2026
HYDలో విమానాల న్యూమాయిష్.. ఎక్కడంటే..?

నగరం మరో ప్రదర్శనకు సిద్ధమవుతోంది. ఈనెల 28 నుంచి నాలుగు రోజుల పాటు విమానాల ప్రదర్శన నిర్వహించనున్నారు. వింగ్స్ ఇండియా పేరిట నిర్వహించే ఈ ఎగ్జిబిషన్లో ప్రముఖ కంపెనీలు తమ విమానాలను ప్రదర్శననున్నాయి. మొదటి రెండు రోజులు బిజినెస్ పీపుల్కు, తరువాతి రెండు రోజులు సిటీ ప్రజలకు విమానాలను చూసే అవకాశం ఇవ్వనున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో ఈ విమానాల ఎగ్జిబిషన్ ఉంటుంది.
News January 18, 2026
శ్రీశైలంలో నేటితో ముగియనున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో నేటి ఆదివారం తో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. సాయంత్రం శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లు అశ్వవాహన సేవలో భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ జరిపిస్తారు. ఆయా ఉత్సవాలతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.


