News November 19, 2025

తిరుపతి రైతులకు నేడు నగదు జమ

image

తిరుపతి జిల్లా రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నగదు ఇవాళ విడుదల కానుంది. జిల్లాలోని 1,54, 908 మంది రైతులకు రూ.104 కోట్లు బుధవారం జమ చేయనున్నారు. కడప జిల్లా నుంచి సీఎం చంద్రబాబు నగదు విడుదల చేస్తారు. తిరుపతి జిల్లాలో ప్రస్తుతం వరినాట్లు మొదలయ్యాయి. వీరికి ఈ నగదు ఎంతగానో ఉపయోగపడనుంది.

Similar News

News January 23, 2026

కొడకండ్ల: ముగ్గురికి జీవిత ఖైదు

image

హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు నమోదైన ఘటన కొడకండ్ల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల ప్రకారం.. మండలంలోని మొండ్రాయి గ్రామానికి చెందిన బూర్గుల ప్రభాకర్‌ను 2017లో హత్య చేసిన భార్య బూర్గుల పూలమ్మ, కుమారులు మురళి, శ్రీకాంత్‌లు కలిసి రోకలిబండతో కొట్టి చంపగా.. నేడు రుజువు అవడంతో జనగామ జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.

News January 23, 2026

MBNR: MVSలో ఉద్యోగమేళా..164 మంది ఎంపిక

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని MVS ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ఉద్యోగమేళా నిర్వహించారు. ఇందులో 164 మంది విద్యార్థులు 18 కంపెనీలలో ఉద్యోగ అర్హత సాధించారు. ఎంపికైన విద్యార్థులకు ఆఫర్ లెటర్స్ ను ప్రిన్సిపల్ డా.కె. పద్మావతి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్లేస్ మెంట్ కో ఆర్డినేటర్ సూర్యనారాయణ, అకాడమిక్ కో ఆర్డినేటర్ రవీందర్, టీఎస్ కేసీ మెంటర్ తేజస్విని, అధ్యాపకులు పాల్గొన్నారు.

News January 23, 2026

ఉత్తమ్‌పై CM నిఘా అని వార్తలు.. మంత్రి క్లారిటీ

image

TG: CM రేవంత్ రెడ్డి మంత్రులు భట్టి, ఉత్తమ్‌పై నిఘా పెట్టి దావోస్ వెళ్లారని ఓ SM పేజ్‌లో వచ్చిన వార్తపై ఉత్తమ్ కుమార్ స్పందించారు. అందులో అసలు నిజం లేదని పేర్కొన్నారు. ఆ వార్త సారాంశం ఏంటంటే.. ‘మంత్రులు vs CM పంచాయితీ హైకమాండ్‌కు చేరింది. మంత్రులు భట్టి, ఉత్తమ్ కుమార్‌ను 12మంది MLAలు కలిశారు. CM ఇద్దరు మంత్రులపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టి వెళ్లారు’ అని వచ్చిన వార్తను మంత్రి ఖండించారు.