News August 21, 2025
తిరుమలకు ఫ్రీ బస్.. కానీ!

తిరుమలకు వెళ్లే బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొండపైకి రోజూ 362 బస్సులు నడుస్తున్నాయి. ఇందులో 64 ఎలక్ట్రికల్ ఏసీ బస్సులు కావడంతో వాటిలో ఫ్రీ టికెట్ ఇవ్వరు. రోజూ కొండపైకి బస్సుల్లో 45వేల మంది ప్రయాణిస్తుంటారు. ఇందులో పురుష భక్తులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిని తీసేస్తే సరాసరి 7వేల మంది ఏపీ మహిళలకు లబ్ధి చేకూరనుంది.
Similar News
News January 15, 2026
ఫోన్ ఎత్తుకెళ్లిన బెంగాల్ సీఎం.. సుప్రీంకోర్టులో ఈడీ

వెస్ట్ బెంగాల్ ఐప్యాక్ కార్యాలయంలో ఈడీ సోదాలపై సుప్రీంకోర్టులో వాడీవేడీగా విచారణ జరిగింది. సోదాల సమయంలో WB సీఎం మమతా తమ ఫోన్ను ఎత్తుకెళ్లినట్లు ఈడీ అధికారులు SCకి తెలియజేశారు. మనీలాండరింగ్ విషయమై సోదాల గురించి ముందే స్థానిక PSకు సమాచారమిచ్చినా పోలీసులతో మమతా తమ సోదాలకు అంతరాయం కలిగించారన్నారు. అటు పోలీసులను మమత నియంత్రించడం తీవ్రమైన అంశంగా సుప్రీంకోర్టు పరిగణించింది.
News January 15, 2026
పొద్దుతిరుగుడు నాటిన తర్వాత కలుపు నివారణ

పొద్దుతిరుగుడు విత్తిన 24-48 గంటల్లోపు ఎకరాకు 200 లీటర్ల నీటిలో 1 లీటర్ పెండిమిథాలిన్30% E.C రసాయనాన్ని కలిపి పిచికారీ చేయాలి. దీని వల్ల 20 రోజుల వరకు కలుపును నివారించవచ్చు. పంట 30-40 రోజుల దశలో అంతరకృషి చేయాలి. ఇది సాధ్యం కాకపోతే గడ్డి జాతి కలుపు నివారణకు ఎకరాకు 400ml క్విజాలొఫాప్ ఇథైల్ 5% ఇ.సి. లేదా ప్రొపాక్విజాఫాప్ 10% ఇ.సి. 250mlను 200 లీటర్ల నీటిలో కలిపి కలుపు 2-4 ఆకుల దశలో పిచికారీ చేయాలి.
News January 15, 2026
ఏటూరునాగారం: ఇద్దరు మావోయిస్టు సభ్యులు లొంగుబాటు

ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్ ఎదుట ఇద్దరు మావోయిస్టు లొంగిపోయారు. వీరిద్దరూ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారు. మద్దేడు పోలీస్ స్టేషన్ పరిధి బందిపార గ్రామానికి చెందిన కుడియం పాండు, టెర్రం పోలీస్ స్టేషన్ పరిధి పెద్దిబట్టిగూడెంకు చెందిన ముచ్చక్కి మంగల్ మద్దెడు ఏరియా కమిటీలో సభ్యులుగా ఉన్నారు. సరెండర్ పాలసీలో భాగంగా వారికి రూ.25,000 చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.


