News November 5, 2025

తిరువన్నామలైలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి

image

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరువన్నామలైకు బుధవారం వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశక్తి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం అర్చకులు ఆలయ మర్యాదలతో సన్మానించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఆయన వెంట వైసీపీ చిత్తూరు ఇన్‌ఛార్జ్ విజయానంద రెడ్డి ఉన్నారు.

Similar News

News January 20, 2026

చిత్తూరు జేసీగా ఆదర్శ రాజేంద్రన్

image

చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా ఆదర్శ రాజేంద్రన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అన్నమయ్య జిల్లా నుంచి ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. గతంలో జేసీగా ఉన్న విద్యాధరి వైజాగ్‌కు బదిలీ అయిన సంగతి తెలిసిందే. పలువురు రెవెన్యూ అధికారులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

News January 20, 2026

క్రైం డేటాను నవీకరించాలి: చిత్తూరు ఎస్పీ

image

క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ డేటాను తక్షణమే నవీకరించాలని.. క్రమం తప్పకుండా అప్ డేట్ చేయాలని ఎస్పీ తుషార్ ఆదేశించారు. పోలీస్ గెస్ట్ హౌస్ లో మంగళవారం ఆయన నేర సమీక్ష నిర్వహించారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలన్నారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. సైబర్ క్రైమ్ ఉచ్చులో ప్రజలు పడకుండా చూడాలన్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు.

News January 20, 2026

చిత్తూరు: ‘సైనికుల త్యాగాలను తెలియజేయాలి’

image

సైనికుల త్యాగాలను విద్యార్థులకు తెలియజేయాలని ఎస్పీ తుషార్ సూచించారు. చిత్తూరు పట్టణంలోని ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన 78వ జాతీయ సైనికుల దినోత్సవానికి ఆయన హాజరయ్యారు. జమ్ములో టెర్రరిస్టుల దాడిలో మృతి చెందిన అమరవీరుడు కార్తీక్ చిత్ర పటానికి ఆయన నివాళులు అర్పించారు. మనం ప్రశాంతంగా ఉన్నామంటే సరిహద్దుల్లో సైనికుల కృషియేనని ఆయన కొనియాడారు.