News November 19, 2025
తూప్రాన్: 145 గ్రాముల ఎండు గంజాయి పట్టివేత

తూప్రాన్ పట్టణంలో 145 గ్రాముల ఎండు గంజాయిని పట్టుకున్నట్టు ఎస్సై శివానందం తెలిపారు. శివంపేట మండలం లచ్చిరెడ్డిగూడెంకు చెందిన దుగ్గూరి శ్రవణ్ కుమార్ కొద్దిరోజులుగా తూప్రాన్ పట్టణంలో నివాసం ఉంటున్నాడు. ఇతడు గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం రాగా దాడులు జరిపి అతని వద్ద నుంచి145 గ్రాముల ఎండు గంజాయి, మొబైల్ ఫోన్ను SI స్వాధీనం చేసుకున్నారు. నాందేడ్కు చెందిన శివ గంజాయి సరఫరా చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News January 19, 2026
నేడు ‘ప్రజావాణి’ రద్దు: మెదక్ కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల సన్నాహక పనుల దృష్ట్యా సోమవారం జిల్లా కలెక్టరేట్తో పాటు నాలుగు మున్సిపాలిటీల్లో నిర్వహించాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లా స్థాయి అధికారులందరూ ఎన్నికల విధుల్లో నిమగ్నమైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అన్ని మండల తాహశీల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుందని, ప్రజలు ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు.
News January 17, 2026
మెదక్: మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు: కలెక్టర్

మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీల వార్డు రిజర్వేషన్లను రాజకీయ పార్టీల సమక్షంలో పారదర్శకంగా ఖరారు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్లో 32, తూప్రాన్లో 16, నర్సాపూర్లో 15, రామాయంపేటలో 12 వార్డులకు రిజర్వేషన్లు కేటాయించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
News January 17, 2026
మెదక్: ప్రాణరక్షణకు హెల్మెట్ తప్పనిసరి: ఎస్పీ

రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని నివారించేందుకు హెల్మెట్ ధరించడం అత్యంత కీలకమని ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ను కేవలం నిబంధనగా కాకుండా, వ్యక్తిగత భద్రతగా భావించాలని పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఆయన హెచ్చరించారు.


