News February 16, 2025

తూ. గో: ఇంటర్ ప్రాక్టికల్స్‌లో 4, 286 మంది హాజరు 

image

తూర్పుగోదావరి జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్స్ భాగంగా శనివారం నిర్వహించిన జనరల్, ఒకేషనల్ విభాగాలలో 2,439 మందికి 2,378మంది హాజరు అయినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎన్ ఎస్ వి ఎల్ నరసింహం తెలిపారు. అలాగే మధ్యాహ్నం జరిగిన ఇంటర్ ప్రాక్టికల్స్ లో 1940 మందికి 1908 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆర్ ఐ ఓ పేర్కొన్నారు.

Similar News

News March 13, 2026

రాజమండ్రిలో అమృత భారత్ ఎక్స్‌ప్రెస్ హాల్ట్

image

చర్లపల్లి-కామాఖ్య అమృత భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు తూర్పుగోదావరి జిల్లా కనెక్టివిటీ లభించింది. ఈ రైలు శుక్రవారం మార్చి 13 నుంచి రాజమండ్రి స్టేషన్‌లో ఆగనుంది. చర్లపల్లి, విజయవాడ, రాజమండ్రి, భీమవరం, దువ్వాడ, విజయనగరం జంక్షన్ వంటి నగరాలను ఈ రైలు అనుసంధానిస్తోంది. దీనివల్ల జిల్లా ప్రజలకు రవాణా సౌకర్యం పెరగడంతో పాటు కామాఖ్య ఆలయ దర్శనానికి వెళ్లే భక్తులకు ఎంతో సౌకర్యం కలగనుంది.

News March 13, 2026

రాజమండ్రిలో అమృత భారత్ ఎక్స్‌ప్రెస్ హాల్ట్

image

చర్లపల్లి-కామాఖ్య అమృత భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు తూర్పుగోదావరి జిల్లా కనెక్టివిటీ లభించింది. ఈ రైలు శుక్రవారం మార్చి 13 నుంచి రాజమండ్రి స్టేషన్‌లో ఆగనుంది. చర్లపల్లి, విజయవాడ, రాజమండ్రి, భీమవరం, దువ్వాడ, విజయనగరం జంక్షన్ వంటి నగరాలను ఈ రైలు అనుసంధానిస్తోంది. దీనివల్ల జిల్లా ప్రజలకు రవాణా సౌకర్యం పెరగడంతో పాటు కామాఖ్య ఆలయ దర్శనానికి వెళ్లే భక్తులకు ఎంతో సౌకర్యం కలగనుంది.

News March 13, 2026

జాతీయ టీటీ పోటీలకు రాజమండ్రి వైష్ణవి సూర్య ఎంపిక

image

ఇండోర్‌లో మార్చి 14 నుంచి 21 వరకు జరగనున్న 87వ జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ పోటీలకు రాజమండ్రి క్రీడాకారిణి వై. వైష్ణవి సూర్య ఎంపికయ్యారు. ర్యాంకింగ్ పోటీల పాయింట్ల ఆధారంగా రాష్ట్ర సీనియర్ మహిళల జట్టులో ఆమె చోటు దక్కించుకున్నారు. గురువారం జిల్లా టీటీ అసోసియేషన్ అధ్యక్షుడు జెవీవీ అప్పారెడ్డి, కోశాధికారి కె.సత్యనారాయణ, కోచ్ సుబ్బారావు ఆమెను అభినందించారు.