News May 13, 2024
తూ.గో: సార్వత్రిక ఎన్నికలు.. సర్వం సన్నద్ధం

సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాకినాడ జిల్లాలో 3,608 బ్యాలెట్ యూనిట్లు, 3,608 కంట్రోల్ యూనిట్లు, 4002 వీవీప్యాట్లు వినియోగిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 3,860 బ్యాలెట్ యూనిట్లు, 3,860 కంట్రోల్ యూనిట్లు, 4,170 వీవీప్యాట్లు వాడుతున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2,040 బ్యాలెట్ యూనిట్లు, 2,040 కంట్రోల్ యూనిట్లు, 2,203 వీవీప్యాట్లు వినియోగిస్తున్నారు.
Similar News
News December 15, 2025
తూ.గో: పాత నేరస్థుల ఇళ్లపై పోలీసుల నిఘా

తూ.గో జిల్లాలో అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ నరసింహ కిషోర్ హెచ్చరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్, స్పెషల్ పార్టీ సిబ్బంది సంయుక్తంగా టీములుగా ఏర్పడి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా 68 నంబర్, రికార్డు లేని ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు సీజ్ చేశామని తెలిపారు. 30 మంది పాత నేరస్థుల ఇళ్లను తనిఖీ చేశామన్నారు.
News December 15, 2025
తూ.గో: ఒక రోజు ముందే పెన్షన్ పంపిణీ

పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. నూతన సంవత్సరంలో ఇవ్వాల్సిన పెన్షన్ను డిసెంబర్ 31వ తేదీ ఉదయం 7 గంటల నుంచే పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కార్యాలయం నుంచి ఆదివారం ప్రకటన వెలువడింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్ను అందజేయనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.
News December 15, 2025
తూ.గో: ఒక రోజు ముందే పెన్షన్ పంపిణీ

పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. నూతన సంవత్సరంలో ఇవ్వాల్సిన పెన్షన్ను డిసెంబర్ 31వ తేదీ ఉదయం 7 గంటల నుంచే పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కార్యాలయం నుంచి ఆదివారం ప్రకటన వెలువడింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్ను అందజేయనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.


