News April 26, 2024

తెనాలిలో కాంగ్రెస్ పార్టీకి షాక్  

image

గుంటూరు జిల్లా తెనాలిలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల అధికారులు షాక్ ఇచ్చారు. మొదట కాంగ్రెస్ పార్టీ తరఫున షేక్ బషీద్‌కి బీఫామ్ ఇవ్వగా ఆయన నామినేషన్ వేశారు. అయితే అనూహ్యంగా నిన్న చివరి నిమిషంలో ఆయనను తప్పించి తెనాలి స్థానికుడైన డాక్టర్ చందు సాంబశివుడిని ప్రకటించింది. ఆయన నిన్న నామినేషన్ దాఖలు చేశారు. అయితే అనూహ్యంగా నేడు అధికారులు వారి ఇద్దరి నామినేషన్లను తిరస్కరించారు. 

Similar News

News April 15, 2026

GNT: మహిళ హత్యకేసులో ఇద్దరి అరెస్ట్

image

తీసుకున్న డబ్బు చెల్లించమని అడిగిన మహిళను హత్య చేసిన లాయర్‌తో పాటు అతని స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాతగుంటూరుకు చెందిన రమాదేవి(46)వద్ద లాయర్ సురేశ్ రూ.10లక్షలు తీసుకొని ఉద్యోగం ఇప్పిస్తానని ఇప్పించకుండా మోసంచేశాడు. తిరిగి చెల్లించమని అడిగితే డబ్బులు ఇస్తానని పిలిచి ఫిబ్రవరి 16న సంగజాగర్లమూడి వద్ద పంట కాలువలోకి తోసి చంపేశారు. సురేశ్‌తోపాటు అతని స్నేహితుడు శేఖర్‌ని అరెస్ట్ చేశారు.

News April 15, 2026

మద్దతు ధర దక్కక గుంటూరు రైతుల ఆవేదన

image

జిల్లాలో దిగుబడులు బాగున్నా మద్దతు ధర దక్కక రైతులు నష్టపోతున్నారు. ఇక్కడ 79,200 ఎకరాల్లో మొక్కజొన్న, 48,465 ఎకరాల్లో శనగ సాగైంది. మద్దతు ధర రూ.2,400 కాగా, ప్రైవేటు మార్కెట్‌లో రూ.1,700కే అమ్ముతూ క్వింటాల్‌కు రూ.700 నష్టపోతున్నారు. కంది మద్దతు ధర రూ.8 వేలు కాగా రూ.7 వేలకే ఇస్తున్నారు. శనగ రైతులకూ ఎకరాకు రూ.5 వేల నుంచి 7 వేల దాకా నష్టం వస్తోంది. నిల్వ సదుపాయాలు లేక దళారులకు తక్కువకి అమ్ముతున్నారు.

News April 15, 2026

నేడు అమరావతికి సీఎం.. షెడ్యూల్ ఇదే..!

image

పల్నాడు(D) అమరావతిలో CM చంద్రబాబు అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. మధ్యాహ్నం 12:40 నిమిషాలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి ధరణికోటలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంగణానికి చేరుకుంటారు. 2:15కు అన్న క్యాంటీన్ ప్రారంభించి లబ్ధిదారులతో CM భోజనం చేయనున్నారు. తిరిగి 2:45 నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.