News August 13, 2025
తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్: నారా రోహిత్

రామచంద్రపురం బైపాస్ పసలపూడి జంక్షన్ వద్ద ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని సినీ నటుడు నారా రోహిత్, మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆవిష్కరించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానుభావుడు ఎన్టీఆర్ అని రోహిత్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్ అని మంత్రి పేర్కొన్నారు. ఎమ్మెల్యే వేగుళ్ల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Similar News
News March 11, 2026
TU: “అడ్వాన్సెస్ ఇన్ కెమికల్ బయాలజీ – నావెల్ థెరాప్టిక్స్” పై జాతీయ సదస్సు

తెలంగాణ విశ్వవిద్యాలయం ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో “అడ్వాన్సెస్ ఇన్ కెమికల్ బయాలజీ – నావెల్ థెరాప్టిక్స్” అనే అంశంపై ఈ నెల 23,24 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు సదస్సు కన్వీనర్ డా.చంద్రశేఖర్ తెలిపారు. సందర్భంగా జాతీయ సదస్సు బ్రోచర్లను ఉపకులపతి ఆచార్య యాదగిరి రావు, రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరితో కలిసి ఆవిష్కరించారు. అధ్యాపకులు సత్యనారాయణ, శిరీష, ప్రసన్న శీల పాల్గొన్నారు.
News March 11, 2026
ఖమ్మం: దారుణం.. ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి

కూసుమంచి మండలంలోని ఒక గ్రామంలో ఐదేళ్ల బాలికపై 45 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన అమానుష ఘటన వెలుగుచూసింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. తీవ్ర రక్తస్రావానికి గురైన బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో, వారు వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
News March 11, 2026
గుంటూరులో వ్యభిచార గృహంపై దాడి

కొత్తపేట PS పరిధిలో తలపకట్టి హోటల్ పక్కన ఓ అద్దె ఇంట్లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై మంగళవారం టాస్క్ ఫోర్స్ బృందం దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకోగా, వారి నుంచి సెల్ ఫోన్లు, 2 కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారాన్ని నిర్వహిస్తున్న లక్ష్మి (అరండలపేట), రాపోలు శివను నిందితులుగా గుర్తించారు. తదుపరి విచారణ కోసం కేసును కొత్తపేట పోలీస్ స్టేషన్కు అప్పగించారు.


