News February 16, 2025
తోట్లవల్లూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

తోట్లవల్లూరు మండలం యాకమూరు రైస్ మిల్లు వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డ్యూటీ ముగించుకొని బైక్పై వస్తున్న ఆర్టీసీ కండక్టర్ చీకుర్తి సురేష్ (47) వెనుక వైపు నుంచి ఎడ్ల బండిని ఢీ కొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News April 14, 2026
MTM: ప్రభుత్వ కార్యక్రమానికి జనసేన డుమ్మా!

మచిలీపట్నంలో జరిగిన అంబేడ్కర్ జయంతి వేడుకలు రాజకీయ చర్చకు దారితీశాయి. ప్రభుత్వ కార్యక్రమాలకు జనసేన నేతలు గైర్హాజరు కాగా, మంత్రి కొల్లు రవీంద్రతో ఉన్న విభేదాల వల్లే వారు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. లక్ష్మీ టాకీస్ సెంటర్లో కూడా ఇరు పార్టీల నేతలు వేర్వేరుగానే నివాళులర్పించారు. పొత్తులో ఉన్నప్పటికీ సంస్థాగత విబేధాల కారణంగా నేతలు కలిసి పని చేయకపోవడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
News April 14, 2026
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరం: కలెక్టర్

అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. మచిలీపట్నంలోని ఫైర్ స్టేషన్లో మంగళవారం ఆయన అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించి, గోడ పత్రికలను ఆవిష్కరించారు. ప్రమాదాల నివారణకు వాడే వివిధ పరికరాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. వారం రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యపరచాలని ఆయన అధికారులను ఆదేశించారు.
News April 14, 2026
కృష్ణా: అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఎక్కడ?

మచిలీపట్నం కోర్టు రోడ్డులోని అంబేడ్కర్ భవన్ శిథిలావస్థకు చేరినప్పటికీ, నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణం అడుగు ముందుకు పడటం లేదు. గతంలో రూ.5కోట్ల నిధులతో నిర్మిస్తామని హామీలు ఇచ్చినా, రాజకీయ వైషమ్యాల వల్ల అది సాధ్యపడలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా.. అటు MP బాలశౌరి, ఇటు మంత్రి కోళ్లు రవీంద్ర మధ్య సఖ్యత లేకపోవడం వల్లే నిర్మాణం నిలిచిపోయిందనే ఆరోపణలు వస్తున్నాయి.


