News September 13, 2025
దసరా: దుర్గగుడిలో ప్రోటోకాల్ టికెట్లు రద్దు?

దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ దుర్గగుడిలో ప్రోటోకాల్ కింద ఇచ్చే బ్రేక్ దర్శనం టికెట్లను ఈసారి రద్దు చేయాలని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. గతేడాది ఎమ్మెల్యేలు, ఎంపీ, కలెక్టర్ వంటి ప్రముఖులకు రోజుకు 100 ఉచిత టికెట్లు కేటాయించారు. దీనివల్ల సాధారణ భక్తులకు దర్శనం ఆలస్యం కావడమే కాకుండా, ఆలయానికి ఆదాయం కూడా తగ్గుతోందని అధికారులు భావిస్తున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
Similar News
News December 12, 2025
పెద్దపల్లి జిల్లాలో FINAL పోలింగ్ శాతం

పెద్దపల్లి(D)లో 5 మండలాల్లోని 99 పంచాయతీల్లో గురువారం మొదటివిడత ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్గా 82.24 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు. కాల్వశ్రీరాంపూర్ 83.06, ముత్తారం 82.75, రామగిరి 77.96, కమాన్పూర్ 83.59, మంథనిలో 84.39 పోలింగ్ నమోదైంది.
News December 12, 2025
RRలో 88.67% ఓటింగ్.. BRS, కాంగ్రెస్ సర్పంచ్లు వీరే!

రంగారెడ్డిలో 1stవిడత సర్పంచ్ ఎలక్షన్స్లో 88.67% పోలింగ్ నమోదైంది. ఆద్యంతం BRS, కాంగ్రెస్ మధ్యే పోటీ నడిచింది.
☛ శంషాబాద్: 21 GPలకు Cong 12, BRS 3, BJP 2
☛ ఫరూక్నగర్: 47GPలకు Cong 28, BRS 18
☛ చౌదరిగూడ: 24GPలకు, Cong 13, BRS 11
☛ కేశంపేట్: 29లకు, Cong 15, BRS 13
☛ కొందుర్గు: 22GPలకు, Cong 13, BRS8, BJP 1
☛ నందిగామ: 19GPలకు Cong 6, BRS 12
☛ కొత్తూరు: 12GPలకు, Cong 9, BRS 3 సర్పంచ్లు గెలిచాయి.
News December 12, 2025
ఈనెల 15 నుంచి జీజీ కళాశాల డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల రీఅడ్మిషన్

జీజీ కళాశాల డిగ్రీ 2, 4, 6, సెమిస్టర్ల రీ అడ్మిషన్లకు జనవరి 12వ తేదీ వరకు అవకాశం ఉందని ప్రిన్సిపల్ డా.రామ్మోహన్ రెడ్డి, కంట్రోలర్ భరత్ రాజ్, వైస్ ప్రిన్సిపల్ డా.రంగరత్నం తెలిపారు. డిగ్రీ రెండో సెమిస్టర్ తరగతులు డిసెంబర్ 15 నుంచి ప్రారంభం అవుతాయననారు. విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరు కావాలని సూచించారు.


