News November 30, 2025
దిత్వా ఎఫెక్ట్.. హోం మంత్రి వీడియో కాన్ఫరెన్స్

దిత్వా తుఫాన్పై నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి వంగలపూడి అనిత అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండు రోజులు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. కంట్రోల్ రూమ్కు వచ్చే ప్రతి కాల్కు వెంటనే స్పందించాలన్నారు.
Similar News
News February 17, 2026
నేటితో శుక్ర మౌఢ్యమి ముగింపు

గతేడాది నవంబర్ 26వ తేదీన మొదలైన శుక్ర మౌఢ్యమి నేటితో ముగియనుంది. ఇన్నాళ్లూ అస్తమయ స్థితిలో ఉన్న శుక్రుడు రేపటి నుంచి తిరిగి శుభప్రదమైన స్థితిలోకి వస్తాడు. దీంతో నిలిచిపోయిన శుభ కార్యాలు రేపటి నుంచి మళ్లీ మొదలవుతాయి. వివాహాలు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు వంటి విలువైన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా, నిశ్చింతగా నిర్వహించుకోవచ్చని పండితులు చెబుతున్నారు.
News February 17, 2026
JGTL: పొమ్మనలేకే పొగనా..? పార్టీ మారుతారా..?

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కొన్నినెలలుగా అవకాశం దొరికినప్పుడల్లా అధిష్ఠానంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దీనిపై పార్టీ బడానేతలు ఏమీ పట్టనట్టు ఉన్నా ఇటీవల పార్టీకి వ్యతిరేకంగా రెబల్స్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనడం హైకమాండ్కి మరింత కోపాన్ని తెప్పించింది. ఎన్ని చెసినా MLA సంజయ్కే పార్టీ అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో రగిలిపోతున్న జీవన్ రెడ్డి పార్టీ మార్పు తప్పదనే సంకేతాలు ఇస్తున్నారు.
News February 17, 2026
జగిత్యాలలో వి’చిత్రం’.. వారికే వరుసగా వైస్ ఛైర్మన్ కుర్చీ

జగిత్యాల మున్సిపల్లో ఇప్పటివరకు ఏర్పడిన అన్ని పాలకవర్గాల్లో ప్రతిసారి వైస్ఛైర్మన్ పదవికి ఒకే ప్రాంతం నుంచి ఎన్నికవ్వడం ఆనవాయితీగా వస్తోంది. వార్డుల విభజన జరిగిన ప్రతీసారి వార్డ్ మెంబర్ మారినా, పట్టణంలోని గంజి ప్రాంతం నుంచే ఎన్నికవుతున్నారు. వీరిలో బదురోద్దిన్, యూసఫ్ అజాద్, కోటగిరి మురళి, మన్సూర్, గోలి శ్రీనివాస్ వైస్ఛైర్మన్ కాగా ప్రస్తుతం జీనత్ పర్వీన్ కూడా గంజి ఏరియా నుంచే ఎన్నికవ్వడం విశేషం.


