News August 21, 2025

దూసుకుపోతున్న KPHB ‘రియల్’ బిజినెస్

image

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా తగ్గుముఖం పడుతోందని వస్తున్న వార్తలను పటాపంచలు చేస్తూ KPHB కాలనీలో ఎకరం ఏకంగా రూ.70 కోట్లు పలికింది. ఐటీ కారిడార్‌కు పక్కనే ఉండడం, కమర్షియల్‌ నిర్మాణాలు శరవేగంగా పెరగుతుండటంతో ఇక్కడి రియల్ వ్యాపారం దూసుకుపోతోందని నిపుణుల అంచనా. గతంలో హౌసింగ్ బోర్డు వేలం వేసిన ప్రతి వేలంపాటలో కూడా ఎక్కడా లేని విధంగా ధర పలుకుతూ వచ్చింది. ఇప్పుడు నగరంలో KPHB హాట్ కేక్‌గా మారింది.

Similar News

News January 21, 2026

అలర్ట్.. దుర్గమ్మ ఆలయం నుంచి కాల్ చేస్తున్నామంటే నమ్మకండి

image

కనకదుర్గమ్మ దేవస్థానం పేరుతో వస్తున్న నకిలీ ఫోన్ కాల్స్ పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఈవో శీనానాయక్ కోరారు. కొంతమంది వ్యక్తులు ఆలయ సిబ్బందిమని చెప్పుకుంటూ భక్తులను మభ్యపెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని బుధవారం ఆయన తెలిపారు. ఇవి సైబర్ మోసాలు అయ్యే అవకాశం ఉందని, గుర్తుతెలియని వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు లేదా నగదు పంపవద్దని సూచించారు. ఏదైనా సందేహం ఉంటే నేరుగా తమను సంప్రదించాలని స్పష్టం చేశారు.

News January 21, 2026

కంచికర్ల: ఉరేసుకుని వ్యక్తి మృతి

image

కంచికచర్ల పట్టణంలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. సొసైటీ బజార్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో నివసిస్తున్న అబ్బూరి హరిబాబు (35) సూసైడ్ చేసుకున్నాడు. కుమారుడి అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో మానసిక ఒత్తిడికి గురైన హరిబాబు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

News January 21, 2026

ఏలూరు: హెచ్చరిక.. ఎవరూ బయటకు రావద్దు!

image

బుట్టాయగూడెం మండలంలో పులి సంచారం నేపథ్యంలో బుధవారం రాత్రి ఎవరు బయటకు రావొద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. గాడిద బోరు, ఇనుమూరు, దొరమామిడి ప్రజలు తెల్లవారు అయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంటి నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. బుట్టాయగూడెం మండలం అంతర్వేదిగూడెం సమీపంలో పులిసంచారం ఉందని అటవీ శాఖ అధికారులు గుర్తించారు.