News March 23, 2025

దేవాదుల పంప్ హౌస్‌ను సందర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు

image

హసన్‌పర్తి మండలంలోని దేవన్నపేట గ్రామంలో గల దేవాదుల పంప్ హౌస్‌ను ఆదివారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు సందర్శించి మోటార్లను పరిశీలించారు. బీఆర్ఎస్ పాలనలోనే దేవాదుల నుంచి రైతులకు నీరు అందిందని.. ఈ కాంగ్రెస్ పాలనలో దేవాదుల ప్రాజెక్టు ను పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు.

Similar News

News April 24, 2025

ఉగ్రదాడిలో హస్తం లేకపోతే పాక్‌కు ఎందుకు ఉలికిపాటు?: మాజీ క్రికెటర్

image

పహల్గామ్ ఉగ్రదాడిలో పాక్ పాత్రపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ప్రశ్నించారు. ‘ఉగ్రదాడిలో నిజంగా పాకిస్థాన్‌ పాత్ర లేకపోయి ఉంటే ప్రధాని షెహబాజ్ ఇంకా ఎందుకు ఖండించలేదు? బలగాలెందుకు హై అలర్ట్‌లో ఉన్నాయి? ఎందుకంటే ఉగ్రవాదులకు నిలయంగా వారిని పెంచి పోషిస్తున్నామని పాక్‌కూ తెలుసు. సిగ్గు పడాలి’ అని ట్వీట్ చేశారు.

News April 24, 2025

MBNR: ప్రశాంత్ రెడ్డి హత్య కుట్ర కేసులో ఇద్దరి అరెస్ట్

image

దేవరకద్ర BJP నేత కొండా ప్రశాంత్ రెడ్డి హత్య కుట్ర కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు MBNR SP జానకి వెల్లడించారు. అనుమానితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. డబ్బు కోసమే ప్రశాంత్ రెడ్డి హత్యకు ప్లాన్ చేశారని, ఇందులో ఎలాంటి రాజకీయకోణం లేదన్నారు. ప్రశాంత్ రెడ్డి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా భయపెడుతున్నారని హత్యకు రూప్‌సింగ్ ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు.

News April 24, 2025

ఒంగోలు: రేషన్ మాఫియా డాన్‌ పనేనా..?

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో ఓ రేషన్ మాఫియా డాన్ పేరు బలంగా వినిపిస్తోంది. ఒంగోలులో హత్య తర్వాత అతను ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు. వాహనాలు మారుస్తూ గుంటూరు(D) వెదుళ్లపల్లికి వెళ్లి అక్కడ ఓ రైస్ మిల్లర్ నుంచి డబ్బులు తీసుకెళ్లినట్లు సమాచారం. ఆ మిల్లర్ సమాచారంతో డాన్‌కు సహకరించారన్న అనుమానంతో నిన్న సాయంత్రం ఐదుగురిని పొన్నూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

error: Content is protected !!