News October 5, 2025
ద్వారకాతిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో నేడు

ద్వారకాతిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో నేడు
✦ఉదయం 7 గంటలకు హనుమంత వాహనంపై గ్రామోత్సవం
✦ఉదయం 8 గంటల నుంచి భజనలు
✦ఉదయం 9 గంటల నుంచి భక్తి రంజని
✦ఉదయం 10 గంటల నుంచి కూచిపూడి భరతనాట్యం
✦సాయంత్రం 4 గంటల నుంచి నాదస్వర కచేరీ
✦సాయంత్రం 5 గంటల నుంచి కూచిపూడి భరతనాట్యం
✦రాత్రి 7 గంటల నుంచి ఎదుర్కోలు ఉత్సవం, వెండి శేషవాహనంపై గ్రామోత్సవం
✦అలంకారం :భూ వరాహ స్వామి
Similar News
News January 24, 2026
విశాఖ: చదువుకున్న వారే మోసపోతున్నారు..

చదువుకున్న వారే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. ఇందులో ఎక్కువగా రిటైర్డ్ ఉద్యోగులే ఉన్నారు. తాజాగా నగరంలోని ఓ రిటైర్డ్ ఉద్యోగిని బెదిరించి సైబర్ ముఠా రూ.10 లక్షల వరకు కాజేశారు. ఈ కేసులో విశాఖ సైబర్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వరంగల్ ప్రాంతానికి చెందిన రమేశ్, పరుశురాములు, నిశాంత్ కలిసి ఓ వ్యక్తి అకౌంట్ తీసుకుని సైబర్ క్రైమ్ ముఠాకు కమిషన్ రూపంలో అప్పజెప్పినట్లు దర్యాప్తులో తేలింది.
News January 24, 2026
రానున్న 24 గంటల్లో వర్షాలు

AP: బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పుగాలుల ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. అలాగే ఉత్తర కోస్తాలో పొగమంచు కురుస్తుందని, 2-3డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయని చెప్పింది. మరోవైపు నిన్న దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. అల్లూరి (D) జి.మాడుగులలో 6.3డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
News January 24, 2026
ప్లాట్ల కేటాయింపు వేగవంతం చేశాం: మంత్రి నారాయణ

అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు వేగవంతం చేశామని మంత్రి నారాయణ తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే 496 ప్లాట్లు కేటాయింపు పూర్తయిందని, మిగిలిన రైతులకు ఈ నెల 28 న లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు చేస్తామని పేర్కొన్నారు. ప్లాట్లు పొందిన రైతులకు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.


