News March 12, 2025
ధన్వాడ: వరి పంటను పరిశీలించిన కలెక్టర్

ధన్వాడ మండలం మందిపల్లి గ్రామానికి చెందిన నర్సింహులు అనే రైతు సాగు చేసిన వరి పంటను మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. ఆ రైతు తన నాలుగు ఎకరాలలో వరి పంట వేయగా ఎకరా వరకు సాగు నీరు లేక ఎండిపోయే దశకు చేరుకుంది. గతేడాది వరి సాగుకు ఎలాంటి సమస్య రాలేదని, ఈ వేసవి కాలం భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు వట్టి పోతున్నాయని, వరి పంట ఎండిపోతుందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
Similar News
News March 19, 2025
బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు సిద్ధమవ్వండి: కలెక్టర్

మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు సిద్ధం కావాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. త్వరలో నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్పై బుధవారం తన ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. గతంలో నిర్వహించిన బీచ్ ఫెస్టివల్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి కొల్లు రవీంద్రతో చర్చించి త్వరలో బీచ్ ఫెస్టివల్ నిర్వహణ తేదీలను ప్రకటిస్తామన్నారు.
News March 19, 2025
NRML: SC వర్గీకరణ, BC రిజర్వేషన్ చారిత్రాత్మక నిర్ణయం: శ్రీహరిరావు

రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు అన్నారు. బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడాన్ని హర్షిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
News March 19, 2025
తాండూర్: ఇంటి పన్ను వసూలు 74% జిల్లాలోని చివరి స్థానం

తాండూర్ మండల వ్యాప్తంగా 33 గ్రామపంచాయతీలో నేటి వరకు 74% ఇంటి పన్ను వసూలు అయినట్లు మండల పంచాయతీ అధికారులు తెలిపారు. 33 గ్రామపంచాయతీలో 100% కంటే తక్కువ ఇంటి పన్ను వసూలు అయిందని, మార్చి చివరి నాటికి 100% ఇంటి పన్ను వసూళ్లే లక్ష్యంగా పంచాయతీ కార్యదర్శులు ముమ్మరంగా పని చేయాలని ఇప్పటికే అధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలోనే చివరి స్థానంలో ఇంటి పన్ను వసూళ్లలో తాండూరు మండలం ఉంది.