News August 11, 2025

నంగునూరు: త్వరలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం

image

నంగునూర్ మండలం నర్మెట గ్రామంలో రూ.300 కోట్లతో నిర్మాణం చేస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. ఫ్యాక్టరీని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫ్యాక్టరీ లోపల బీటీ రోడ్డు నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణం వేగం పెంచాలని ఇంజినీరింగ్ అధికారులకు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అతిత్వరలో ప్రారంభానికి ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు

Similar News

News March 13, 2026

విజయనగరంలో జోయాలుక్కాస్ గ్రాండ్ ఓపెనింగ్

image

విజయనగరంలో జోయాలుక్కాస్‌‌ జువెలరీ షోరూమ్‌ను స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు శుక్రవారం ఉదయం ప్రారంభించారు. వినియోగదారులు ఈ షోరూమ్‌లో ఒకే చోట బంగారం, వజ్రాలు, విలువైన రాళ్లు, ప్లాటినం, వివాహ ఆభరణాలు పొందవచ్చని ఆమె పేర్కొన్నారు. మార్చి 29 వరకు తయారీ ఛార్జీలపై ఫ్లాట్ 40% ప్రారంభ ఆఫర్‌ను అందిస్తున్నట్లు గ్రూప్ ఛైర్మన్&మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జోయ్ అలుక్కాస్ తెలిపారు.

News March 13, 2026

జిల్లాలో బాపట్ల మండలం అత్యధికం

image

బాపట్ల జిల్లా వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కింద అత్యధికంగా బాపట్ల మండలంలో రైతులకు లబ్ధి చేకూరనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల తెలిపారు. బాపట్ల మండలంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 11,275 మందికి రూ.4.51 కోట్లు, పీఎం కిసాన్ పథకం ద్వారా 8,811 మందికి 1.76 కోట్లు నిధులు విడుదల కానున్నట్లు తెలిపారు. మొత్తంగా 6.27 కోట్ల రూపాయలు నిధులు శుక్రవారం నేరుగా రైతుల ఖాతాల్లో జమవుతాయన్నారు.

News March 13, 2026

ఆర్మూర్: 68 గ్యాస్ సిలిండర్లు సీజ్

image

ఆర్మూర్ పట్టణంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా గృహ వినియోగ (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్లను వాడుతున్న 31 సెంటర్లను గుర్తించి, మొత్తం 68 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. వాణిజ్య అవసరాలకు డొమెస్టిక్ సిలిండర్లు వాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.