News April 20, 2024

నందిగాం: బైక్ మీద నుంచి జారిపడి మహిళ మృతి

image

నందిగం మండలం పెంటూరు గ్రామానికి చెందిన కూర్మాపు సరోజిని(48) కుమారుడు రమేష్‌కు ఈనెల 24న వివాహం నిశ్చయమైంది. పెళ్లి సామగ్రి కొనుగోలు చేసేందుకు కుమారుడుతో కలిసి శుక్రవారం బైక్ పై పలాస వెళ్లి తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో జారిపడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. మరో 5 రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది.

Similar News

News December 16, 2025

శ్రీకాకుళం జిల్లా నుంచి నియామక పత్రాలు ఎంతమంది అందుకున్నారంటే.!

image

శ్రీకాకుళం జిల్లా నుంచి కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను CM చంద్రబాబు నేడు మంగళగిరిలో అందించిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా నుంచి మొత్తం 373 మంది ఎంపికైనట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో..
☛ సివిల్ కానిస్టేబుల్స్ మెన్-129
☛ కానిస్టేబుల్ ఉమెన్- 20
☛ APSP- 224 మంది ఉన్నట్లు స్పష్టం చేశారు.

News December 16, 2025

శ్రీకాకుళం జిల్లాలో 1,55,876 మంది పిల్లలకు పోలియో చుక్కలు

image

ఈనెల 21 నుంచి జిల్లాలో జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. (0-5) ఏళ్లలోపు 1,55,876 మంది పిల్లలు ఉన్నారని, ఆయా కేంద్రాల్లో పోలియో చుక్కలు వేయనున్నట్లు DMHO డాక్టర్ కే అనిత మంగళవారం తెలిపారు. అందుబాటులో లేని వారికి 22 – 25 తేదీల్లో ఇంటింటికి వెళ్లి వేస్తారన్నారు. జిల్లాలో మొత్తం 1252 పోలియో కేంద్రాలు ఉన్నాయన్నారు.

News December 16, 2025

శ్రీకాకుళం: 3 ఏళ్ల నిరీక్షణకు.. నేటితో తెర..!

image

కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022 నవంబర్‌లో విడుదలై నేటికీ దాదాపు 3 సంవత్సరాలు పూర్తయింది. ప్రభుత్వం కోర్టు కేసులు పరిష్కరించి అర్హత గల కానిస్టేబుల్ అభ్యర్థుల జాబితాను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన వారికి నేడు మంగళగిరిలోని జరిగే కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి బస్సుల్లో మంగళగిరి చేరుకున్నారు.