News September 11, 2025

నంద్యాల: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి

image

నంద్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రణాళిక రూపొందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా స్కిల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు.

Similar News

News December 16, 2025

NZB: బాలుడి విక్రయం కలకలం.. తల్లితో సహా ముగ్గురి అరెస్ట్

image

నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టలో 2 నెలల బాలుడి విక్రయం కలకలం రేపింది. మహారాష్ట్రలోని పూణేకు చెందిన వారికి రూ.2.40 లక్షలకు కన్న బిడ్డను తల్లి లక్ష్మీ హైదరాబాద్‌లో అమ్మగా పోలీసులకు బాలుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. బాలుడి తల్లితో సహా విఠల్, రమాదేవి అనే ముగ్గురిని 4వ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

News December 16, 2025

ఖమ్మంలో మూడో విడత పోరుకు సిద్ధం: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో ఏడు మండలాల్లోని 191 గ్రామ పంచాయతీల్లో మూడో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఇప్పటికే 22 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 168 పంచాయతీలకు 485 మంది సర్పంచ్‌లు పోటీలో ఉన్నారు. మొత్తం 2.44 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 318 క్రిటికల్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.

News December 16, 2025

మాజీ ఎంపీ రామ్ విలాస్ కన్నుమూత

image

రామ జన్మభూమి ఉద్యమ నేత, బీజేపీ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి(67) కన్నుమూశారు. కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రేవా(మధ్యప్రదేశ్)లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో నిన్న చనిపోయారు. వేదాంతి అంత్యక్రియలు ఇవాళ అయోధ్యలో జరగనున్నాయి. ఆయన తన జీవితాన్ని అయోధ్య ఆలయ నిర్మాణం కోసమే అర్పించారు. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 2సార్లు MPగా గెలిచారు.