News December 1, 2025
నంద్యాల పీజీఆర్ఎస్కు 278 దరఖాస్తులు

ప్రజా పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజల నుంచి 278 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అర్జీల ఆడిట్ను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రీ ఓపెన్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.
Similar News
News February 17, 2026
రికార్డు సృష్టించిన శ్రీలంక, ఆస్ట్రేలియా మ్యాచ్

T20 WCలో భాగంగా శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ రికార్డు సృష్టించింది. హాట్స్టార్లో 10 కోట్ల మంది ప్రత్యక్షంగా వీక్షించారు. దీంతో ఈ టోర్నీలో 100 మిలియన్ల వ్యూయర్షిప్ సాధించిన తొలి నాన్ ఇండియా మ్యాచ్గా నిలిచింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 181 పరుగుల <<19162360>>లక్ష్యాన్ని<<>> 2 వికెట్లు కోల్పోయి 18 ఓవర్లలోనే శ్రీలంక ఛేదించింది. T20 WCలో ఆ జట్టుకు ఇదే హయ్యెస్ట్ ఛేజింగ్.
News February 17, 2026
KMR: కలిసొచ్చిన మూడు ఓట్లు.. చైర్ పర్సన్కు మలుపు

కామారెడ్డి మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ ఎన్నిక మూడు రోజులపాటు మూడు ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టించి కంటిమీద కునుకు లేకుండా చేసింది. చివరకు మూడు ఓట్ల తేడాతో 38వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పైనే విజయం సాధించిన స్వతంత్ర అభ్యర్థి ఇప్ప ఉమారాణి (కాంగ్రెస్ రెబల్) మళ్లీ కాంగ్రెస్లో చేరి ఛైర్ పర్సన్గా ఎన్నికయ్యారు. ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఆమె BRS మద్దతుతో పుర పీఠం ఎక్కడం గమనార్హం.
News February 17, 2026
ఇక MPTC, ZPTC ఎన్నికలపై ఫోకస్!

TG: పంచాయతీ, మున్సిపల్ పోరు ముగియడంతో ఇక MPTC, ZPTC ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇవాళ అధికారులతో CM రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ తర్వాత పోల్స్పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకే విడతలో పోలింగ్ నిర్వహించాలని, 15-20 రోజుల్లో పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్, <<19148172>>ఇంటర్<<>>, టెన్త్ పరీక్షలకు తగ్గట్లుగా ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నారు.


