News March 31, 2024
నంబూరు: భద్రత, కౌంటింగ్ ఏర్పాట్లకై యూనివర్శిటి పరిశీలిన

ఈవీఎంల భద్రత, కౌంటింగ్ ఏర్పాట్లకై ఆచార్య నాగార్జున యూనివర్శిటీని జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్ రెడ్డి శనివారం పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన భద్రతతో పాటు, ఇతర రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా ఎన్నికల అధికారి ఆదేశించారు. పరిశీలనలో జిల్లా ఎస్పీ తుషార్ దూడీ, మంగళగిరి రిటర్నింగ్ అధికారి రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 13, 2026
GNT: రాజధాని రైతులకు ముఖ్య గమనిక

రాజధాని అమరావతి రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో ప్రతి శనివారం నిర్వహించే “గ్రీవెన్స్ డే” శనివారం అనగా ఫిబ్రవరి 14న రద్దు చేస్తున్నట్లు CRDA అధికారులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నిర్వహణ కారణాల రీత్యా రేపు గ్రీవెన్స్ డే జరగదని, రాజధాని ప్రాంతవాసులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News February 13, 2026
GNT: అధ్యాపకుల గైర్హాజరు.. నోటీసులకు కలెక్టర్ ఆదేశాలు

చేబ్రోలు డిగ్రీ కళాశాలను కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాల పరిసరాలు పరిశుభ్రత అధ్వానంగా ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యాపకుల హాజరు పట్టిక పరిశీలించిన కలెక్టర్ పలువురు గైర్హాజరు పట్ల ప్రశ్నించారు. మూమెంట్ రిజిస్టర్ పరిశీలించి అందులో ఎటువంటి అనుమతులు నమోదు చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. గైర్హారైన అధ్యాపకులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు.
News February 13, 2026
GNT: జెడ్పీటీసీ విభజనపై కసరత్తు

ఉమ్మడి గుంటూరు జిల్లా మూడు జిల్లాలుగా విడిపోయిన నేపథ్యంలో జెడ్పీటీసీ స్థానాల పునర్విభజనపై ఎన్నికల కమిషన్ చర్యలు ప్రారంభించింది. పల్నాడులో 28 జెడ్పీటీసీలు ఉండగా, గుంటూరు, బాపట్లలో కూడా విభజన పనులు కొనసాగుతున్నాయి. 3 జిల్లా పరిషత్లు ఏర్పడే అవకాశంతో ఛైర్మన్ పదవులపై నేతలు దృష్టి పెట్టారు. గతంలో ఎన్నికలు జరగని పంచాయతీలలో ఓటర్ల జాబితాలలో ఇంకా స్పష్టత రాలేదని సమాచారం.


