News March 21, 2024
నరసరావుపేటలో గోపిరెడ్డిదే రికార్డ్ మెజార్టీ

నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో 1952 నుంచి 15 సార్లు ఎన్నికల జరిగాయి. గత ఎన్నికల్లో గెలిచిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిదే ఇప్పటి వరకు భారీ మెజార్టీ. టీడీపీ అభ్యర్థిపై ఆయన 32,277 ఓట్ల మెజార్టీతో 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో కోడెల శివప్రసాదరావు(1985)ది అత్యల్ప మెజార్టీ 2,065. రానున్న ఎన్నికల్లో వైసీపీ నుంచి మరోసారి గోపిరెడ్డి బరిలో ఉండగా, TDP కూటమి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.
Similar News
News April 15, 2026
టీడీపీ రాష్ట్ర కమిటీలో గుంటూరు నేతలకు ప్రాధాన్యం

టీడీపీ రాష్ట్ర, జాతీయ కమిటీలను అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ కమిటీల్లో గుంటూరు జిల్లా నేతలకు కీలక పదవులు దక్కాయి. గుంటూరు పశ్చిమ నుంచి పిడుగురాళ్ల మాధవిని పొలిట్ బ్యూరోగా నియమించారు. తెనాలి శ్రవణ్ కుమార్, భాష్యం రామకృష్ణ, కల్పటపు బుచ్చి రాంప్రసాద్, వీఆర్ శ్రీలక్ష్మిలకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవులు ఇచ్చారు. దాసరి ఉదయశ్రీ యాదవ్, తాడిశెట్టి మురళి సహా పలువురికి రాష్ట్ర స్థాయి కమిటీల్లో చోటు కల్పించారు.
News April 15, 2026
టీడీపీ రాష్ట్ర కమిటీలో గుంటూరు నేతలకు ప్రాధాన్యం

టీడీపీ రాష్ట్ర, జాతీయ కమిటీలను అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ కమిటీల్లో గుంటూరు జిల్లా నేతలకు కీలక పదవులు దక్కాయి. గుంటూరు పశ్చిమ నుంచి పిడుగురాళ్ల మాధవిని పొలిట్ బ్యూరోగా నియమించారు. తెనాలి శ్రవణ్ కుమార్, భాష్యం రామకృష్ణ, కల్పటపు బుచ్చి రాంప్రసాద్, వీఆర్ శ్రీలక్ష్మిలకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవులు ఇచ్చారు. దాసరి ఉదయశ్రీ యాదవ్, తాడిశెట్టి మురళి సహా పలువురికి రాష్ట్ర స్థాయి కమిటీల్లో చోటు కల్పించారు.
News April 15, 2026
ఇంటర్ ఫలితాల్లో సత్తా గుంటూరు జిల్లా స్టూడెంట్స్

<<19653702>>ఇంటర్ ఫలితాల్లో<<>> గుంటూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్లో 33,643 మందికి 29,530 మంది పాసయ్యారు. 88 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్లో 30,551 మంది పరీక్షలు రాయగా 26,856 మంది పాసయ్యారు. 88 శాతం పాస్ పర్సంటేజీతో గుంటూరు జిల్లా రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచింది.


