News February 17, 2025

నరసరావుపేట: ఈ కొండపై పెళ్లిళ్లు జరగవు

image

మహాశివరాత్రి, కార్తీక మాస సమయాల్లో కోటప్పకొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. పరమశివుడు దక్షిణామూర్తిగా, బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు. కాబట్టి ఇక్కడ పెళ్లిళ్లు కూడా జరగవు. దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్లో ఇదొక్కటే. ఇక్కడ మహా శివుడిని పూజిస్తే జాతకంలో గురు బలం పెరుగుతుందని భావిస్తారు. ఈ కారణంగా ఇతర గ్రహాల ప్రభావం పడకుండా రక్షణ పొందుతారు. 

Similar News

News March 12, 2026

ఎక్కువ రేట్లకు సిలిండర్లు అమ్ముతున్నారా.. కాల్ చేయండి.!

image

గ్యాస్ సిలిండర్లపై అసత్య వార్తలు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని ఎస్పీ తుషార్ డూడీ హెచ్చరించారు. సిలిండర్ల కొరత, ధరలు పెరిగాయని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. అధిక ధరకు సిలిండర్లు విక్రయిస్తే 112 సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలు అధికారిక సమాచారాన్ని విశ్వసించాలన్నారు.

News March 12, 2026

MNCL: క్లస్టర్ బ్లాక్ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

image

మంచిర్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం మై భారత్ ఆధ్వర్యంలో క్లస్టర్ బ్లాక్ స్థాయి క్రీడా పోటీలు ఇంచార్జీ ప్రిన్సిపాల్ డా.నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ పోటీలలో కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రన్నింగ్, షటిల్ బ్యాడ్మింటన్, వాలీబాల్ క్రీడల్లో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీలు రెండు రోజుల పాటు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.

News March 12, 2026

సిరిసిల్ల: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన అంబులెన్స్

image

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు కామారెడ్డి వెళ్లేందుకు బస్టాండ్‌లోకి వస్తుండగా.. ఎదురుగా వచ్చిన 102 అంబులెన్స్ అదుపుతప్పి బస్సును ముందు భాగంలో బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఉన్నప్పటికీ, ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.