News April 26, 2024
నరసరావుపేట: ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల

పల్నాడు జిల్లాలో ఓపెన్ పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైనట్లు విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. 10వ తరగతి పరీక్షలకు 1, 239 మంది హాజరుకాగా, 412 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారన్నారు. 33.25% ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు 2,720 మంది విద్యార్థులు హాజరు కాగా, 1, 549 ఉత్తీర్ణత సాధించారన్నారు. 56.95% ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.
Similar News
News April 13, 2026
GNT: అక్రమ విద్యుత్.. రూ.12.93 లక్షల ఫైన్

విద్యుత్ శాఖ విజిలెన్స్, ఆపరేషన్స్ విభాగం సంయుక్తంగా సోమవారం విద్యుత్ సర్వీసుల తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టాయి. D13 సెక్షన్ పరిధిలోని ఆటోనగర్, నవభారత్ నగర్, ఆర్టీసీ కాలనీ ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి. 54 మంది అధికారులు, 158 మంది సిబ్బంది, 54 బృందాలుగా ఏర్పడి 4,489 సర్వీసులను తనిఖీ చేశారు. ఇందులో నిబంధనలకు విరుద్దంగా ఉన్న 190 సర్వీసులపై రూ.12.93లక్షల అపరాధ రుసుం విధించారు.
News April 13, 2026
అమరావతి ORRకు 19 ఇంటర్ చేంజ్లు

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ప్లానింగ్ పూర్తయింది. 190 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ మార్గంలో యాక్సెస్ కంట్రోల్ కఠినంగా ఉంటుంది. వాహనాలు ఈ రోడ్డుపైకి రావడానికి, బయటకు వెళ్లడానికి కేవలం 19 చోట్ల మాత్రమే ఇంటర్ చేంజ్లు ఏర్పాటు చేస్తున్నారు. నందివెలుగు, తెనాలి స్పర్ రోడ్, నారాకోడూరు, పుల్లడిగుంట, లింగాయపాలెం, మేడికొండూరు, కాజ తదితర 19 ప్రాంతాల్లో మాత్రమే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉండనున్నాయి.
News April 13, 2026
PGRS ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి: SP

పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరిస్తామని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. గుంటూరు డీపీవోలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులతో కలిసి వకుల్ జిందాల్ ప్రజల ఫిర్యాదులను తెలుసుకొని వినతీ పత్రాలు స్వీకరించారు. మొత్తం 178 ఫిర్యాదులు అందాయని అన్నారు. నిర్ణీత గడువు లోపు సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఈ సందర్బంగా ఎస్పీ ఆదేశించారు.


