News August 11, 2025
నరసరావుపేట: ‘ప్రాథమిక అంశాలు నేర్పించడంలో నిర్లక్ష్యం వద్దు’

జాతీయ నూతన విద్యా విధానం ప్రకారం ప్రతి విద్యార్థికి రాయడం, చదవడం, ప్రాథమిక గణితం నేర్పించాలని కలెక్టర్ అరుణ్ బాబు ఉపాధ్యాయులను ఆదేశించారు. కలెక్టరేట్లో ‘వికసిత్ భారత్ కోసం మానవ వనరుల అభివృద్ధి’ కార్యక్రమంపై జరిగిన జిల్లా స్థాయి వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు సిలబస్ పూర్తి చేయాలనే ఆలోచనతో విద్యార్థులకు ప్రాథమిక అంశాలు నేర్పించడం నిర్లక్ష్యం చేయవద్దన్నారు.
Similar News
News March 13, 2026
టెన్త్ పరీక్షలు.. విద్యార్థులు ఇలా ప్లాన్ చేసుకోండి!

TG: టెన్త్ విద్యార్థుల బోర్డు పరీక్షలకు సమయం ఆసన్నమైంది. రేపటి నుంచి జరిగే పరీక్షల కోసం మొదటగా హాల్ టికెట్, పెన్నులు సిద్ధం చేసుకోండి. పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోండి. ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదివి ప్రతి ప్రశ్నకు ఎంత సమయం కేటాయించాలో ముందే ప్లాన్ చేసుకోండి. మీకు బాగా వచ్చిన సమాధానాలను ముందుగా రాయండి. చివరి 10 నిమిషాల్లో రాసిన జవాబులన్నింటినీ ఓసారి సరిచూసుకోండి. ALL THE BEST
News March 13, 2026
తిరుపతి: శ్రీరమాదేవి హాస్పిటల్పై విచారణ

తిరుపతిలోని శ్రీరమాదేవి హాస్పిటల్పై తమకు ఫిర్యాదు అందినట్లు DMHO బాలాజీ నాయక్ తెలిపారు. పలమనేరు నుంచి బ్రెయిన్ డెడ్తో వచ్చిన శ్రీనివాస్కు సర్జరీ చేశారు. తర్వాత హార్ట్ స్ట్రోక్తో మృతిచెందారు. డబ్బుల కోసం <<19345828>>మృతదేహాన్ని ఇవ్వలేదనే <<>>ఫిర్యాదుపై విచారణకు ఆదేశించామని, 2వారాల్లో నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని DMHO తెలిపారు. తానే ఫోన్ చేసి మృతదేహాన్ని ఇవ్వాలని ఆసుపత్రి యజమానికి సూచించానన్నారు.
News March 13, 2026
HMDA వర్సెస్ కార్పొరేషన్: ఫీజులన్నీ ఎవరికి?

10 అంతస్తులకు మించిన బిల్డింగ్ అనుమతులను HMDA తన గుప్పిట్లోకి తీసుకోవడంపై లోకల్ బాడీలు రగిలిపోతున్నాయి. గతంలో కార్పొరేషన్లకు అందే బిల్డింగ్ పర్మిషన్ ఫీజులు ఇప్పుడు HMDA ఖాతాలోకి వెళ్లడం వల్ల తమ అభివృద్ధి పనులకు నిధులు కరువవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఇది కేవలం ప్లానింగ్ కోసం చేసిన మార్పు కాదు, బడా ప్రాజెక్టుల ఆదాయాన్ని కేంద్రీకరించే వ్యూహం అని స్పష్టమవుతోంది.


