News March 13, 2025
నరసాపురం: బాలికపై లైంగికదాడి.. జీవితఖైదు

నరసాపురంలో ఒకరి జైలుశిక్ష పడింది. సీఐ బి.యాదగిరి వివరాల ప్రకారం.. నరసాపురం అరుంధతిపేటకు చెందిన పెడరి నర్సింహరాజు పార్కు రోడ్డులో టాయిలెట్లు శుభ్రం చేసేవాడు. ఈక్రమంలో 2017లో ఓ మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. భీమవరం ఫొక్సో కోర్టు జడ్జి B.లక్ష్మీనారాయణ 18మంది సాక్షులను విచారించారు. నర్సింహరాజుకు జీవిత ఖైదు, రూ.5 వేలు జరిమానా విధించారు. బాధితురాలకి రూ.50వేలు చెల్లించాలని తీర్పునిచ్చారు.
Similar News
News February 16, 2026
నరసాపురం: గల్ఫ్ వెళ్లిన మహిళ మృతి.. కానిస్టేబుల్పై కేసు

గల్ఫ్ పంపించి ఒక మహిళ మృతికి కారణమైన ఇద్దరు వ్యక్తులపై ఆదివారం నరసాపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. చిట్టవరంకి చెందిన మురాల రాజమణి(48) డిసెంబర్ 4, 2025న గల్ఫ్లో మృతి చెందింది. రాజమణిని ఉండికి చెందిన భీమవరం ట్రాఫిక్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న అలుగు యేసేబు, బింకం విమలు గల్ఫ్ పంపారు. అక్కడ అనారోగ్యానికి గురైన తన తల్లికి వైద్య సదుపాయాలు కల్పించలేదని కుమార్తె ఉషా పోలీసులుకు ఫిర్యాదు చేసింది.
News February 16, 2026
ప్రశాంతంగా శివరాత్రి ఉత్సవాలు: కలెక్టర్

జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు నడుమ శివరాత్రి మహోత్సవాలు ప్రశాంతంగా జరిగాయని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 క్షేత్రాలలో సోమేశ్వర స్వామి దేవాలయం, క్షీర రామలింగేశ్వర స్వామి 2 పంచారామ క్షేత్రాలు మన జిల్లాలోనే ఉండడం ఎంతో విశేషం అన్నారు. శైవక్షేత్రాలను సుమారు 3 లక్షల 50 వేల మంది పైగా భక్తులు దర్శించుకోవడం జరిగిందన్నారు.
News February 16, 2026
నేడు యథావిధిగా PGRS

భీమవరం కలెక్టరేట్, జిల్లాలోని అన్ని ప్రభుత్వ మండల కార్యాలయాల్లో సోమవారం PGRSను యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు.


