News December 15, 2025

నరసాపురం వరకు వందేభారత్.. నేడే ప్రారంభం

image

AP: చెన్నై సెంట్రల్-విజయవాడ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ నేటి నుంచి నరసాపురం వరకు నడవనుంది. ఇవాళ కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ నరసాపురం రైల్వేస్టేషన్‌లో జెండా ఊపి చెన్నై వెళ్లే రైలును ప్రారంభిస్తారు. షెడ్యూల్.. చెన్నై నుంచి రైలు(20677) 5.30AMకు బయలుదేరి 11.45AMకు విజయవాడ వస్తుంది. గుడివాడ, భీమవరం మీదుగా 2.10PMకు నరసాపురం చేరుకుంటుంది. తిరిగి ట్రైన్(20678) 2.50PMకు బయలుదేరి 11.45PMకు చెన్నైకి వెళ్తుంది.

Similar News

News January 19, 2026

వెకేషన్‌లో నయన్- త్రిష.. 40ల్లోనూ తగ్గని గ్లామర్!

image

స్టార్ హీరోయిన్లు నయనతార, త్రిష మధ్య విభేదాలు ఉన్నాయంటూ గత కొంతకాలంగా వినిపిస్తున్న రూమర్లకు ఈ ఫొటోలతో చెక్ పడింది. దుబాయ్‌లో ఒక లగ్జరీ బోట్‌పై చిల్ అవుతున్న ఫొటోలను నయన్ షేర్ చేశారు. ‘ముస్తఫా ముస్తఫా don’t worry ముస్తఫా.. కాలం నీ నేస్తం ముస్తఫా’ అని రాసుకొచ్చారు. 40 ఏళ్లు దాటినా వీరి గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని, ఇప్పటికీ డ్రీమ్ గర్ల్స్‌లా మెరిసిపోతున్నారని నెటిజన్లు కొనియాడుతున్నారు.

News January 19, 2026

CBN వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు: మంత్రి లోకేశ్

image

AP: ఏడాదిన్నరలో రాష్ట్రానికి రూ.23.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటివల్ల 16 లక్షల మంది యువతకు ఉద్యోగాలొస్తాయని దావోస్‌లో మంత్రి లోకేశ్ తెలిపారు. అభివృద్ధి, ఐటీ, క్వాంటమ్ అంటూ ఏపీని సీబీఎన్ నడిపిస్తున్నారని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వైపు చూస్తున్నారంటే ఆయనే కారణమన్నారు. ఇక రాష్ట్రంలో ఉన్న 11 మంది ఏడుపుగొట్టు టీమ్ పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటోందని పరోక్షంగా వైసీపీని విమర్శించారు.

News January 19, 2026

ఇతిహాసాలు క్విజ్ – 128 సమాధానం

image

ప్రశ్న: అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్లడం తెలిసినా, బయటకు రావడం ఎందుకు తెలియదు?
సమాధానం: అభిమన్యుడు తన తల్లి సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించే విధానం గురించి వివరిస్తుంటే విన్నాడు. అయితే, వ్యూహం నుంచి బయటకు వచ్చే మార్గాన్ని చెప్పే సమయానికి సుభద్ర నిద్రపోయింది. దీంతో గర్భంలో ఉన్న అభిమన్యుడికి లోపలికి వెళ్లడం మాత్రమే తెలిసింది. బయటకు రావడం తెలియలేదు.
<<-se>>#Ithihasaluquiz<<>>