News August 14, 2025

నల్గొండ: ఇరిగేషన్ శాఖ మినిస్టర్ ఉత్తమ్ విడియో కాన్ఫరెన్స్

image

ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాజెక్టుల వద్ద 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం అలసత్వం వహించవద్దని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో జీవో నం. 45 ప్రకారం నిధులు వినియోగించుకోవాలన్నారు. కాలువ కట్టలు తెగే సూచనలు గుర్తిస్తే వెంటనే సమాచారం అందించాన్నారు. విపత్తు సమయంలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Similar News

News March 9, 2026

వచ్చిన నీరు వచ్చినట్టే పాయే.. గొంతు ఎండనుందా!

image

ఈ ఏడాది వేసవి కాలం జిల్లా ప్రజలకు చుక్కలు చూపించేలా ఉంది. ముఖ్యంగా తాగునీటి విషయంలో గండం పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాకు ప్రధాన నీటి వనరైన నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి లభ్యత ఆశాజనకంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ నెల నుంచి జూన్ వరకు తాగునీటి అవసరాలకే సుమారు 65.49 టీఎంసీలు అవసరం కాగా, నిల్వలు మాత్రం కనిష్ఠ స్థాయికి చేరువలో ఉన్నాయి.

News March 9, 2026

నల్గొండ: పల్లె వనాలు ఆహ్లాదకరంగా ఉండాలి: కలెక్టర్‌

image

గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాలు సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచేలా ఉండాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం చందనపల్లిలోని ప్రకృతి వనం, డంపింగ్ యార్డును ఆయన తనిఖీ చేశారు. వనాల్లో నీడనిచ్చే చెట్లతో పాటు రంగురంగుల పూల మొక్కలను పెంచాలని, ప్రజలు, పిల్లలు సేదతీరేలా వాటిని తీర్చిదిద్దాలని సూచించారు. పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News March 9, 2026

నల్గొండ: పల్లె వనాలు ఆహ్లాదకరంగా ఉండాలి: కలెక్టర్‌

image

గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాలు సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచేలా ఉండాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం చందనపల్లిలోని ప్రకృతి వనం, డంపింగ్ యార్డును ఆయన తనిఖీ చేశారు. వనాల్లో నీడనిచ్చే చెట్లతో పాటు రంగురంగుల పూల మొక్కలను పెంచాలని, ప్రజలు, పిల్లలు సేదతీరేలా వాటిని తీర్చిదిద్దాలని సూచించారు. పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.