News August 13, 2025

నల్గొండ: ఉద్యోగాల పేరిట మోసం.. నిందితులకు రిమాండ్

image

ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు శాలిగౌరారం సీఐ కొండల్ రెడ్డి తెలిపారు. విశాఖపట్నంకు చెందిన సాయిరామ జగదీష్, మహేష్, సురేష్‌‌ను అరెస్టు చేసి నకిరేకల్ జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, వారికి రిమాండ్ విధించారు. దీంతో వారిని నల్గొండ జైలుకు తరలించినట్లు సీఐ చెప్పారు.

Similar News

News March 9, 2026

నల్గొండ: పల్లె వనాలు ఆహ్లాదకరంగా ఉండాలి: కలెక్టర్‌

image

గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాలు సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచేలా ఉండాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం చందనపల్లిలోని ప్రకృతి వనం, డంపింగ్ యార్డును ఆయన తనిఖీ చేశారు. వనాల్లో నీడనిచ్చే చెట్లతో పాటు రంగురంగుల పూల మొక్కలను పెంచాలని, ప్రజలు, పిల్లలు సేదతీరేలా వాటిని తీర్చిదిద్దాలని సూచించారు. పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News March 9, 2026

నల్గొండ: పల్లె వనాలు ఆహ్లాదకరంగా ఉండాలి: కలెక్టర్‌

image

గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాలు సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచేలా ఉండాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం చందనపల్లిలోని ప్రకృతి వనం, డంపింగ్ యార్డును ఆయన తనిఖీ చేశారు. వనాల్లో నీడనిచ్చే చెట్లతో పాటు రంగురంగుల పూల మొక్కలను పెంచాలని, ప్రజలు, పిల్లలు సేదతీరేలా వాటిని తీర్చిదిద్దాలని సూచించారు. పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News March 8, 2026

NLG: కొత్త వాహనాలపై రహదారి భద్రతా సెస్

image

జిల్లాలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌పై రహదారి భద్రతా సెస్ అమల్లోకి వచ్చింది. ద్విచక్ర వాహనాలకు రూ.2వేలు, తేలికపాటి వాహనాలకు రూ.5వేలు, కార్లు, ఇతర రవాణేతర వాహనాలకు రూ.10వేల వరకు సెస్ వసూలు చేయనున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చే వాహనాలపై 4% నుంచి 65% వరకు పన్ను విధించనున్నారు. దీంతో కొనుగోలుదారులపై అదనపు భారం పడనుంది.