News March 10, 2025
నల్గొండ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఈనెల 11, 12 తేదీల్లో నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. కమిషన్ ఛైర్మన్ వెంకటయ్య అధ్యక్షతన సభ్యులు కుస్త్రం నీలాదేవి, రాంబాబునాయక్, కొంకతి లక్ష్మీ నారాయణ, జిల్లా శంకర్, రేణిగుంట్ల ప్రవీణ్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసులు, భూములకు సంబంధించిన కేసులపై సమీక్షిస్తారని పేర్కొన్నారు.
Similar News
News March 15, 2025
NLG: కృత్రిమ మేధాతో బోధన.. నేటి నుంచి ప్రారంభం

నల్గొండ జిల్లాలో ఎంపిక చేసిన ప్రాథమిక పాఠశాలల్లో నేటి నుంచి కృత్రిమ మేధాతో బోధన ప్రారంభం కానుంది. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 10 మండలాల్లో 14 పాఠశాలలను ఎంపిక చేశారు. అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) సాయంతో ప్రాథమిక విద్య బలోపేతం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. చదువులో వెనుకబడిన పిల్లల కోసం ఎంపిక చేసిన పాఠశాలల్లో ఏఐ బోధన చేపట్టనున్నారు.
News March 15, 2025
గుర్రంపూడ్: గ్రూప్-3లో మెరిసిన కానిస్టేబుల్

గుర్రంపూడ్ మండలం కొప్పోల్ గ్రామానికి శంకర్ గ్రూప్ -3లో మెరిశాడు. శంకర్ ప్రస్తుతం సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్లో సివిల్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ.. కష్టపడి చదివి గ్రూపు-3 కి ఎంపికయ్యాడు. ఇటీవల విడుదలైన గ్రూపు-2 ఫలితాలలో 674వ ర్యాంక్, గ్రూప్ -3 ఫలితాలలో 165వ ర్యాంకు సాధించాడు. దీంతో శంకర్కు అభినందనలు వెల్లువెత్తాయి
News March 15, 2025
NLG: ఓపెన్ డిగ్రీ చదివి గ్రూప్స్ సాధించాడు

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన గ్రూప్-2 గ్రూప్-3 ఫలితాలలో దామరచర్ల మండలం తాళ్ల వీరప్పగూడెం గ్రామానికి చెందిన పెండెం సందీప్ సత్తా చాటారు. గ్రూప్-2 ఫలితాలలో 85వ ర్యాంక్, గ్రూప్-3లో 50 ర్యాంక్ సాధించారు. గీత కార్మికుల కుటుంబానికి చెందిన సందీప్ ఓపెన్ డిగ్రీ చదివి గ్రూప్ ఫలితాలలో సత్తా చాటడం పట్ల అతని తల్లిదండ్రులు శ్రీను, సాయమ్మ గ్రామస్థులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.