News August 11, 2025
నల్గొండ: ‘దరఖాస్తు చేసుకోకుండానే కుల ధ్రువపత్రం జారీ’

కుల ధ్రువపత్రం జారీలో ప్రభుత్వం మార్పులు చేసిందని NLG అధికారులు తెలిపారు. దీంతో విద్యార్థులకు ఊరట లభించింది. గతంలో మీసేవ ద్వారా ఆధార్, రేషన్ కార్డు జతపరిచి దరఖాస్తు చేసుకున్నాక, దానిని ఆర్ఐ, తహశీల్దర్ ఆమోదించిన తర్వాత మీసేవ ద్వారా తీసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు అలా కాకుండా తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండానే పొందే వెసులుబాటు కల్పించింది. పాత దరఖాస్తు, ఆధార్ నంబర్ ద్వారా మీ సేవలో పొందవచ్చు.
Similar News
News March 15, 2026
రేపటి నుంచి ‘రైతన్నా.. మీ కోసం’

AP: సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 16 నుంచి 10 రోజుల పాటు ‘రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అగ్రిటెక్, డీప్టెక్ ద్వారా రానున్న ఖరీఫ్ సీజన్లో సాగు విధానాలపై అవగాహన కల్పిస్తారు. ప్రకృతి వ్యవసాయం, ఎల్నినో నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేస్తారు. ఈ నెల 25న జరిగే ముగింపు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.
News March 15, 2026
చదువుకోవడం ఇష్టం లేక సూసైడ్

పెద్దవడుగూరు మండలం విరుపాపురంలో యువకుడు కళ్యాణ్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 3 ఏళ్ల క్రితం ఇంటర్ ఫస్టియర్లో కొన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ కావడంతో ప్రస్తుతం ఇంటి వద్ద ఖాళీగా ఉన్నాడు. సప్లమెంటరీ రాసుకొమ్మని కుటుంబసభ్యులు చెప్పారు. కళ్యాణ్కు చదువుకోవడం ఇష్టం లేక మామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకొన్నాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.
News March 15, 2026
నెతన్యాహు చనిపోయారని వార్తలు.. ఇజ్రాయెల్ PMO క్లారిటీ!

ఇరాన్ దాడుల్లో నెతన్యాహు చనిపోయారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఇజ్రాయెల్ PMO ఖండించింది. ఈ విషయంపై Anadolu న్యూస్ ఏజెన్సీ ప్రతినిధి సంప్రదించగా క్లారిటీ ఇచ్చింది. ‘అదంతా ఫేక్ న్యూస్. ప్రధాని క్షేమంగా ఉన్నారు’ అని తెలిపింది. నెతన్యాహు కుడిచేతికి 6 వేళ్లు ఉన్న <<19382555>>ఓ వీడియో<<>> SMలో వైరలైంది. అది AI వీడియో అని, ఆయన మరణం గురించి శత్రుదేశానికి తెలియొద్దనే ఆ వీడియో రిలీజ్ చేశారని కొందరు పేర్కొన్నారు.


