News September 10, 2025

నల్గొండ: ప్రాజెక్టులు పూర్తైతే పెరగనున్న సాగు విస్తీర్ణం

image

ఉమ్మడి NLG జిల్లా రైతులకు మహర్ధశ పట్టనుంది. మంగళవారం జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించిన మంత్రి ఉత్తమ్ 2027 నాటికి అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. SLBC పూర్తైతే సుమారు 4 లక్షల ఎకరాలు, డిండి ఎత్తిపోతల కింద మూడున్నర లక్షల ఎకరాలు, బస్వాపూర్ కింద 23 వేల ఎకరాలు, మరికొన్ని ప్రాజెక్టులు కింద కలుపుకుని 8 లక్షల ఎకరాలకు పైనే సాగు విస్తీర్ణం పెరగనుంది.

Similar News

News December 10, 2025

సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా: ఎస్పీ రోహిత్ రాజు

image

కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు బుధవారం కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక వ్యక్తులను గుర్తించి, వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సబ్ డివిజన్‌లోని పోలీస్ స్టేషన్ల పరిధిలోని పంచాయతీల వారీగా ప్రస్తుత పరిస్థితులను తెలుసుకున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆదేశించారు.

News December 10, 2025

కేంద్రమంత్రిని కలిసిన కాకినాడ MP

image

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మంగళవారం ఢిల్లీలోని ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మామిడి తాండ్రపై జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించినందుకు ఎంపీ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో మామిడి తాండ్ర తయారీ ప్రధాన జీవనోపాధిగా ఉందని, ఈ తగ్గింపు వల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు మరింతగా పెరగనున్నాయని ఎంపీ వివరించారు.

News December 10, 2025

కరీంనగర్: మూడో విడతతో 20 GPలు ఏకగ్రీవం

image

గ్రామపంచాయతీ మూడో విడత ఎన్నికల్లో 20 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ధ్రువీకరించారు. జగిత్యాల జిల్లాలో 6, సిరిసిల్ల – 7, కరీంనగర్ – 1, పెద్దపల్లి జిల్లాలో 6 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. కాగా, మొదటి విడత రేపు పోలింగ్ జరగనుండగా, రెండో విడత 14న, విడత మూడో విడత 17న పోలింగ్, అదేరోజు సాయంత్రం ఫలితాలను వెల్లడిస్తారు.