News May 7, 2025

నల్గొండ: విషాదం.. రోడ్డు ప్రమాదంలో స్నేహితులు మృతి

image

నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండిలో <<16216733>>తీవ్రవిషాదం<<>> చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బింగి మత్స్యగిరి (20), మర్రి శివకుమార్(21) ఇద్దరు స్నేహితులు బైక్‌పై వెళ్తూ స్తంభానికి డీకొట్టారు. ఈ ఘటనలో వారు అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామంలో స్నేహితుని వివాహం సందర్భంగా వచ్చి మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలాన్ని మునుగోడు ఎస్ఐ రవి సందర్శించి కేసు నమోదు చేసుకున్నారు.

Similar News

News February 16, 2026

సమష్టి కృషితో జిల్లా ప్రగతి: నల్గొండ కలెక్టర్

image

నల్గొండ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’లో ఆయన పాల్గొని బాధితుల నుంచి 82 వినతులను స్వీకరించారు. కోర్టు కేసులు, కమిషన్లలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై వెంటనే కౌంటర్‌ దాఖలు చేయాలని సూచించారు. మార్చి నెలాఖరులోగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

News February 16, 2026

నల్గొండ: బందోబస్తు పరిశీలించిన ఎస్పీ శరత్ చంద్రపవార్

image

నల్గొండ జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు 6 మున్సిపాలిటీల్లో మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో విజయవంతంగా ముగిసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల ప్రక్రియను జరిపేందుకు పోలీస్ శాఖ తరఫున పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

News February 16, 2026

నల్గొండ: ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయంటే..

image

ఇటీవల జరిగిన ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన అధికారిక గణాంకాలు వెల్లడయ్యాయి. మొత్తం 2,40,514 ఓట్లు పోలవ్వగా, కాంగ్రెస్‌కు అత్యధికంగా 1,13,149 ఓట్లు దక్కాయి. బీఆర్ఎస్ 74,163 ఓట్లతో రెండో స్థానంలో నిలవగా, బీజేపీ 24,479 ఓట్లకు పరిమితమైంది. పట్టణ ప్రాంతాల్లోనూ బీజేపీ ప్రభావం చూపలేకపోయిందని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ భారీ మెజార్టీతో ముందంజలో ఉండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.