News December 1, 2025
నల్గొండ: 3న గుర్తుల కేటాయింపు.. 11న పోలింగ్!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటి నామినేషన్లకు సంబంధించి సోమవారం అప్పీల్కు అవకాశం ఉంది. 2వ తేదీన వచ్చిన ఫిర్యాదుల పరిష్కరిస్తారు. 3న మ.3గంటలకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటించి గుర్తులు కేటాయిస్తారు. ఈలోపు మరిన్ని గ్రామాల్లో ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 9వతేదీ సాయంత్రం వరకు ప్రచారానికి అవకాశం ఉంది. 11వ తేదీ ఉదయం పోలింగ్ ప్రారంభమై 1 గంటకు ముగియనుంది.
Similar News
News February 19, 2026
వరుణ్.. నువ్వో వరం!

టీ20ల్లో టీమ్ ఇండియాకు వరుణ్ చక్రవర్తి వరంలా మారారు. గత 29 టీ20ల్లో 28 మ్యాచుల్లో అతడు వికెట్లు పడగొట్టడం విశేషం. ఒక్క మ్యాచులో మాత్రమే వికెట్లు తీయలేదు. కీలక సమయాల్లో తన మిస్టరీ బంతులతో బ్యాటర్లను బోల్తా కొట్టించడం వరుణ్ స్పెషల్. ఈ ప్రపంచకప్లోనూ మిగతా బౌలర్లు వికెట్లు తీయలేక ఇబ్బందులు పడుతుంటే వరుణ్ వరుసగా వికెట్లు తీస్తూ భారత్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.
News February 19, 2026
బాల్క సుమన్ గొడవ క్రియేట్ చేశారు: వివేక్

క్యాతన్పల్లిలో బాల్క సుమన్ అరెస్ట్ను ఖండించిన ఎమ్మెల్యే హరీశ్ రావుపై మంత్రి వివేక్ ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికకు వస్తున్న ఎంపీ, మంత్రి వాహనాలపై రాళ్లు రువ్విన వారికి ఎలా సపోర్ట్ చేస్తారని నిలదీశారు. అసలు అక్కడ గొడవ జరగలేదని.. సుమన్ కావాలని గొడవ క్రియేట్ చేశారని మండిపడ్డారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకోలేదని, కావాలనే తమపై లేనిపోని నిందలు వేస్తున్నారని ఆగ్రహించారు.
News February 19, 2026
భారీగా తగ్గిన రష్యన్ ఆయిల్ దిగుమతులు

భారత్ చమురు దిగుమతుల్లో రష్యా వాటా భారీగా తగ్గింది. ఒకప్పుడు 40% ఉన్న షేర్ ఇప్పుడు 21.1%కు పడిపోయింది. జనవరిలో రోజుకు 1.1 మిలియన్ బ్యారెళ్ల చమురును మాత్రమే దిగుమతి చేసుకుంది. 2022 నవంబరు తర్వాత ఇంత తక్కువ దిగుమతులు చేసుకోవడం ఇదే తొలిసారి. మార్చిలో ఈ దిగుమతి రోజుకు 8లక్షల బ్యారెళ్లకు పడిపోవచ్చని అంచనా. మరోవైపు జనవరి చమురు దిగుమతుల్లో మిడిల్ ఈస్ట్ వాటా దాదాపు 55%గా నమోదైంది.


