News March 25, 2024

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రస్థానం

image

1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేశారు. 2004లో ప్రభుత్వ చీఫ్ విప్‌గా, 2009లో అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.  2004లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర నాయకత్వ పగ్గాలు చేపట్టిన తర్వాతే రాష్ట్ర మీడియా దృష్టిని ఆకర్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పనిచేశారు. ఆ తర్వాత సొంత పార్టీ పరాజయాల అనంతరం బీజేపీలో చేరారు.

Similar News

News December 11, 2025

కడప: గాన కోకిల ఎం.ఎస్. సుబ్బలక్ష్మి వర్ధంతి

image

కడప జిల్లా వాసులు గాన కోకిల ఎం.ఎస్. సుబ్బలక్ష్మిని మరువలేరు. ఆమె గానం చేసిన వేంకటేశ్వర స్వామి సుప్రభాతం ప్రతి శనివారం ఉదయం కడప ఆల్ ఇండియా రేడియో స్టేషన్ నుంచి ప్రసారమవుతుంది. ఆమె పాటలు గుండెల్లో గుర్తుండిపోయాయని, ఆమె మన మధ్య లేకపోయినా, ఆమె గానం ఎప్పుడూ గుర్తుంటుందని కడప వాసులు గురువారం ఆమె వర్ధంతి సందర్భంగా స్మరించుకున్నారు.

News December 11, 2025

కడప YVUలో ప్రవేశానికి దరఖాస్తులు

image

కడప YVU పరిధిలోని అనుబంధ కళాశాలల్లో నాలుగో సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు వైవియూ డైరెక్టర్ డా. టి. లక్ష్మిప్రసాద్ తెలిపారు. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. మూడు సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు నాలుగు సంవత్సరాల యు.జి కోర్సుకు అర్హులు. వివరాల కోసం www.yvu.edu.in ను సంప్రదించవచ్చు.

News December 11, 2025

మేయర్, ఎంపీపీ స్థానాలు వైసీపీకే: రవీంద్రనాథ్ రెడ్డి

image

ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు న్యాయమే గెలిచిందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన జిల్లా పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కడప నగర మేయర్‌తో పాటు ముద్దనూరు ఎంపీపీ స్థానాన్ని కూడా వైసీపీ కైవసం చేసుకుందన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు చేసింది ఏమీ లేదన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.