News February 17, 2025
నస్రుల్లాబాద్: తాళం వేసిన ఇంట్లో చోరీ

తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన నస్రుల్లాబాద్లో జరిగింది. దుర్కి గ్రామానికి చెందిన రేఖవార్ రాజు, స్వరూపరాణి దంపతులు ఈ నెల 9న ఇంటికి తాళం వేసి కుంభమేళాకు వెళ్లారు. కాగా వారి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయని పక్కింటి వారు సమాచారం ఇవ్వడంతో ఆదివారం వచ్చి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించారు. ఇంట్లో బంగారం పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయగా SI లావణ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News April 16, 2026
TG DEECET దరఖాస్తుల సవరణకు అవకాశం

TG DEECET-2026 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు విద్యాశాఖ కీలక సమాచారం అందించింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు జరిగిన దరఖాస్తు ప్రక్రియలో భాగంగా మొత్తం 32,611 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు ఉంటే ఈనెల 17, 18వ తేదీల్లో వెబ్సైట్ ద్వారా సవరించుకోవచ్చు. సందేహాల నివృత్తికి 8317567404 నంబర్ను సంప్రదించాలని కన్వీనర్ సూచించారు.
News April 16, 2026
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: ఎస్పీ వకుల్

యువతను డ్రగ్స్ రహిత సమాజం వైపు నడిపించడమే లక్ష్యంగా గుంటూరు జిల్లా పోలీస్ శాఖ శ్రీకారం చుట్టిన ‘సంకల్పం’ కార్యక్రమం గురువారం చేబ్రోలులోని విజ్ఞాన్ యూనివర్సిటీలో జరిగింది. గంజాయి, మాదక ద్రవ్యాలు విద్యార్థుల బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తాయని SP వకుల్ జిందాల్ హెచ్చరించారు. ప్రతి విద్యార్థి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని, వ్యసనాల బారిన పడకుండా చదువుపై ఏకాగ్రత వహించాలని పిలుపునిచ్చారు.
News April 16, 2026
నరసన్నపేట: ‘ముద్దాయిలకు న్యాయవాదులను ఏర్పాటు చేస్తాం’

నరసన్నపేటలోని స్థానిక సబ్ జైలును జిల్లా న్యాయాధికార సేవా సంస్థ కార్యదర్శి హరిబాబు ఆకస్మికంగా పరిశీలించారు. గురువారం మధ్యాహ్నం సబ్ జైలుకు చేరుకున్న ఆయన ఖైదీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ..బెయిల్ కోసం ప్రయత్నం చేసే ముద్దాయిలకు న్యాయాధికారి సేవా సంస్థ తరఫున ఉచితంగా న్యాయవాదులను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో సబ్ జైలు సూపరింటెండెంట్ వినయ్ కుమార్ ఉన్నారు.


