News November 19, 2025
నాగర్కర్నూల్లో పెరిగిన చలి

నాగర్కర్నూల్ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో వెల్దండ మండలం బొల్లంపల్లిలో కనిష్ఠ ఉష్ణోగ్రత 13.2గా నమోదైంది. అమ్రాబాద్, తోటపల్లిలో 13.9, సిర్సనగండ్లలో 14.1 ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉదయం వేళల్లో అధిక చలి కారణంగా జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Similar News
News January 19, 2026
రాణా బ్యాటింగ్ అద్భుతం: సునీల్ గవాస్కర్

న్యూజిలాండ్తో చివరి వన్డేలో టీమ్ఇండియా బౌలర్ హర్షిత్ రాణా అద్భుతంగా బ్యాటింగ్ చేశారని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. షార్ట్ పిచ్ బాల్స్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని చెప్పారు. టీమ్ ఒత్తిడిలో ఉన్నప్పుడు బ్యాటింగ్కు వచ్చిన రాణా చక్కటి ఇన్నింగ్స్ ఆడారని తెలిపారు. రాణా 43 బాల్స్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 52 రన్స్ చేశారు. 7వ వికెట్కు విరాట్తో కలిసి 99రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు.
News January 19, 2026
హుస్నాబాద్: అదుపుతప్పిన బైక్.. సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి

హుస్నాబాద్ మండలం పూల్నాయక్ తండాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి బర్మావత్ మనోహర్(27) బైక్ అదుపుతప్పి కరెంటు పోల్ను ఢీకొని మృతిచెందాడు. సంక్రాంతి సెలవుల్లో స్వగ్రామానికి వచ్చిన మనోహర్ హుస్నాబాద్-కరీంనగర్ మార్గంలో సబ్స్టేషన్ సమీపంలో సోమవారం ప్రమాదానికి గురయ్యాడు. 108 సిబ్బంది ఆయనను ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
News January 19, 2026
సౌత్ ఇండియన్ సైన్స్ ఫెయిర్లో ర్యాలమడుగు ఉపాధ్యాయుడు

నిజాంపేట మండలం ర్యాలమడుగు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు వినయ్ కుమార్ సైన్స్ ప్రదర్శనలో తన ప్రతిభను చాటారు. తెలంగాణ ఉపాధ్యాయ విభాగంలో ఉత్తమ ప్రాజెక్టుగా ఎంపికైన ఆయన కొల్లూరులో నిర్వహిస్తున్న దక్షిణ భారతదేశ వైజ్ఞానిక ప్రదర్శనలో ఇంటరాక్టివ్ మ్యాథ్స్ కార్నర్ ప్రదర్శించారు. గణితంలో వినూత్న బోధనలతో సత్తా చాటుతున్నారు. ఖేడ్ ఉపాధ్యాయులు చంద్రశేఖర్ ఆచార్య, జైపాల్ రెడ్డి అభినందించారు.


