News May 7, 2025
నాగర్ కర్నూల్లో వ్యాక్సిన్ క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్సీ

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రూబీ గార్డెన్లో హజ్ యాత్రికుల కోసం వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యాక్సిన్ క్యాంపును శనివారం ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి మాట్లాడారు. మైనార్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. హజ్ యాత్రికులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధికారులు, ముస్లిం నాయకులు పాల్గొన్నారు.
Similar News
News February 12, 2026
ఒమన్పై లంక ఘన విజయం

T20WCలో ఒమన్పై శ్రీలంక 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత శ్రీలంక 225/5 స్కోర్ చేసింది. కుశాల్ మెండిస్(61), పవన్(60), దసున్ శనక(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. 226 రన్స్ టార్గెట్తో బరిలో దిగిన ఒమన్ 120/9 స్కోరుకే పరిమితమైంది. ఈ విజయంతో గ్రూప్-Bలో లంక(4 పాయింట్లు) అగ్రస్థానానికి చేరుకుంది. తొలి మ్యాచ్లో ఐర్లాండ్పై గెలిచిన విషయం తెలిసిందే.
News February 12, 2026
సంగారెడ్డి: ఈనెల 17 నుంచి ఫ్రీ ఫైనల్ పరీక్షలు

సంగారెడ్డి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈనెల 17 నుంచి 24 వరకు పదో తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ప్రతిరోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు మండల వనరుల కేంద్రాల నుండి ప్రశ్నపత్రాలను సేకరించాలని సూచించారు. వార్షిక పరీక్షలకు ముందు విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు పరీక్షలు దోహదపడతాయన్నారు.
News February 12, 2026
విశాఖలో జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు

విశాఖపట్నం జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి జూన్ జి.విలియమ్స్ సాప్ (SAAP) లీగ్స్ జిల్లా స్థాయి ఎంపికల వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరి 17న గోపాలపట్నం ఇండోర్ స్టేడియంలో చదరంగం, 24న బీచ్ రోడ్డులో సైక్లింగ్ పోటీలు జరుగుతాయి. ఆసక్తిగల క్రీడాకారులు తమ ఆధార్ కార్డుతో సాప్ (SAAP) అధికారిక వెబ్సైట్లో తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని ఆమె సూచించారు.


