News August 13, 2025
నాటిన మొక్కలను సంరక్షించాలి: కలెక్టర్

నాటిన మొక్కలను ప్రతి ఒక్కరూ సంరక్షించాలని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బుధవారం సాత్నాల మండలకేంద్రంలో ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి ఆయన మొక్కలను నాటారు. అనంతరం సాత్నాల ప్రాజెక్టును పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గేట్ ఎత్తే వేసే ముందు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సమాచారం అందజేయాలని సూచించారు.
Similar News
News March 9, 2026
ఆదిలాబాద్: రేపే జాబ్ మేళ.. అన్ని ఏర్పాట్లు పూర్తి

ఆదిలాబాద్ పట్టణంలోని AR హెడ్ క్వాటర్స్లో మంగళవారం మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సుమారు 50 వరకు కంపెనీలు ఇందులో పాల్గొని దాదాపు 2,000 మందిని భర్తీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఆసక్తి గల నిరుద్యోగులు తమ ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.
News March 8, 2026
ADB: ట్రేడ్ టెస్ట్ పరీక్షలకు దరఖాస్తులు

ITI సంబంధిత ఏదైనా ట్రేడుల్లో అనుభవం ఉండి సర్టిఫికేట్ లేని ప్రైవేట్ అభ్యర్థుల నుంచి ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ ITI ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ITI కోర్సులకు సంబంధించిన ట్రేడుల్లో కనీసం 3 సం.ల పని అనుభవం కలిగి, 21 వయస్సు వారు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 15 లోపు వరంగల్లోని రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అఫీసులో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News March 8, 2026
ADB: బాధితుల ఇండ్ల వద్ద ఎఫ్ఐఆర్ నమోదు

ఆదిలాబాద్ సబ్ డివిజన్ పరిధిలో బాధితుల ఇండ్ల వద్దకే శనివారం పోలీసులు వెళ్లి ఫిర్యాదులు స్వీకరించారు. డివిజన్ పరిధిలో 6 కేసులలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సులభంగా వేగంగా సేవలు అందించాలని లక్ష్యంతో బాధితుల ఇంటి వద్దకే వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధానాన్ని పోలీస్ శాఖ అమలులోకి తీసుకువచ్చిందని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. ఇది బాధితులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు.


