News November 19, 2025
నారాయణపేట: పొగమంచులో ఓవర్టేక్ చేయొద్దు: ఎస్పీ

చలికాలంలో ఉదయం రోడ్లపై పొగమంచు పెరుగుతున్నందున రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉందని నారాయణపేట ఎస్పీ వినీత్ వాహనదారులను హెచ్చరించారు. వాహనాల వేగం తగ్గించి, సురక్షిత దూరం పాటించాలని సూచించారు. ముఖ్యంగా, పొగమంచులో ఓవర్టేక్ చేయడం పూర్తిగా మానుకోవాలని, జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News January 17, 2026
USలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నారా? జాగ్రత్త!

అమెరికాలో ఇద్దరు భారత విద్యార్థులను ఇమిగ్రేషన్ & కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) కస్టడీలోకి తీసుకుంది. మిన్నెసోటాలోని సెయింట్ లూయిస్ పార్క్లో ప్రముఖ భారతీయ రెస్టారెంట్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. అక్కడ పని చేస్తున్న సిబ్బందిని ప్రశ్నించారు. F-1(స్టూడెంట్) వీసా నిబంధనలను ఉల్లంఘించి రెస్టారెంట్లో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నారనే కారణంతో ఇద్దరు ఇండియన్లను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
News January 17, 2026
బాడీ స్ప్రే ఎక్కువగా వాడుతున్నారా?

చెమట నుంచి వచ్చే దుర్వాసనను తప్పించుకునేందుకు కొందరు, మంచి సువాసన కోసం మరికొందరు బాడీ స్ప్రేలు వాడుతుంటారు. అయితే వీటిని ఎక్కువగా వాడటం వల్ల పలు సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే ప్రొపిలిన్ గ్లైకాల్ అనే రసాయనం వల్ల దీర్ఘకాలంలో కాంటాక్ట్ డెర్మటైటీస్, హైపర్ పిగ్మెంటేషన్, గ్రాన్యూలోనూ వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్, పారాబెన్ లేని వాటిని వాడాలని సూచిస్తున్నారు.
News January 17, 2026
కన్నుల పండువగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శనివారం భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం వేడుక ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళ తాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి బేడా మండపంలో కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం అనంతరం కంకణ ధారణ, యౌక్త్రధారణ గావించి నిత్య కళ్యాణాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు.


