News December 29, 2024
నాలుగో విడత రుణమాఫీకి రైతుల ఎదురుచూపులు
ఉమ్మడి జిల్లాలో నాలుగో విడత రుణమాఫీ కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 11,301 మంది రైతులకు రూ.110 కోట్లు, సిద్దిపేట జిల్లాలో రూ.95 కోట్లకు అర్హులైన 9,063 మంది రైతులు నాలుగో విడత జాబితా కింద పేర్లు ఉన్నాయి. మెదక్ జిల్లాలో రూ.56 కోట్లకు అర్హులైన 7వేల మంది రైతులను లబ్ధిదారుల జాబితాలో గుర్తించారు. తమ ఖాతాలో ప్రభుత్వం నగదు ఎప్పుడు జమ చేస్తుందోనని వారు చూస్తున్నారు.
Similar News
News January 16, 2025
మెదక్: సర్వేను పక్కగా నిర్వహించాలి: కలెక్టర్
రామాయంపేట మండలం కాట్రియల్ గ్రామంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహిస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, కొత్త రేషన్ కార్డుల సర్వేను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు పంచాయతీ సెక్రటరీ ధనలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.
News January 16, 2025
3 రోజుల్లో నుమాయిష్కు 2,21,050 మంది
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతున్న నుమాయిష్కు 3 రోజుల్లో మొత్తం 2,21,050 మంది సందర్శకులు తరలివచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. సంక్రాంతి రోజు ఎక్కువగా 76,500 మంది నుమాయిష్కు రాగా.. ఎగ్జిబిషన్లోని అన్ని స్టాల్స్ జనసంద్రంగా మారాయి. పాఠశాలలకు సంక్రాంతి సెలవుల నేపథ్యంలో మరో 2 రోజులు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
News January 16, 2025
గజ్వేల్: అనాథలైన ముగ్గురు పిల్లలు
సిద్దిపేట జిల్లా బంగ్లావెంకటాపూర్ గ్రామంలో ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు. దర్శనం నర్సింలు-నాగమణి దంపతులకు ముగ్గురు కొడుకులు. నర్సింలు మతిస్తిమితం కోల్పోయి తిరుగుతుండగా.. ఆయన భార్య ఈ నెల 5న కిడ్నీ వ్యాధితో చనిపోయింది. దీంతో వారి పిల్లలు రాజేందర్(7), హరికృష్ణ(5), చందు(3) అనాథలుగా మారారు. వీరికి వృద్దురాలైన అమ్మమ్మ మాత్రమే తోడుగా ఉంది. దాతలు ముందుకొచ్చి వారిని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.