News October 6, 2025
నిజాంసాగర్: 3 గేట్ల నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద తాకిడి తగ్గుముఖం పట్టింది. సోమవారం ఉదయం 6 గంటలకు 16,507 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 3 వరద గేట్లను ఎత్తి 10,987 క్యూసెక్కుల నీటిని మంజీరాకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ అక్షయ్ తెలిపారు. పూర్తిస్థాయి నీటి నిల్వ 17.802 టీఎంసీలకు గాను, ప్రస్తుతం ప్రాజెక్టులో 17.759 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు వెల్లడించారు.
Similar News
News January 18, 2026
ఖమ్మం:పురపాలక పీఠాలపై ‘మహారాణుల’ రాజ్యమే..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మొత్తం 9 స్థానాల్లో (రెండు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలు) ఆరింటిని మహిళలకే కేటాయించారు. ఖమ్మం మేయర్, వైరా, సత్తుపల్లి, మధిర, అశ్వారావుపేటలను జనరల్ మహిళకు కేటాయించగా.. ఇల్లెందు బీసీ మహిళకు, ఏదులాపురం ఎస్సీ మహిళకు దక్కాయి. కల్లూరు, కొత్తగూడెంలు ఎస్టీ జనరల్ విభాగంలో ఉన్నాయి. పురపాలక పీఠాలపై మహిళల ఆధిపత్యం ఖాయమైంది.
News January 18, 2026
కడప: ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీనా.. ఫోన్ చేయండి.!

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు ఛార్జీలను విపరీతంగా పెంచాయి. దీంతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. దీనిపై రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. నిబంధనలకు లోబడి మాత్రమే ఛార్జీలను వసూలు చేయాలని ట్రావెల్స్ యజమానులకు సూచించారు. ఎవరైన అధిక ఛార్జీలు వసూలు చేస్తే 9281607001 నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
News January 18, 2026
నకిలీ మద్యం మరణాలకు CBN బాధ్యత వహిస్తారా: వైసీపీ

AP: నకిలీ మద్యం తాగి ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మరణించారంటూ ప్రభుత్వంపై YCP మండిపడింది. వీరి చావులకు సీఎం చంద్రబాబు బాధ్యత తీసుకుంటారా అని ‘ఎక్స్’లో ప్రశ్నించింది. అన్నమయ్య జిల్లాలో నిన్న సాయంత్రం ఫ్రెండ్స్తో కలిసి మద్యం సేవించిన మణికుమార్, పుష్పరాజ్ తీవ్ర అస్వస్థతకు గురై మరణించారని విమర్శించింది. ఎక్స్పైర్, నకిలీ మద్యం అమ్ముతూ TDP లిక్కర్ సిండికేట్ సొమ్ము చేసుకుంటోందని వైసీపీ ఆరోపించింది.


