News March 28, 2024
నిజామాబాదీలు జర జాగ్రత్త..!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రత 40 సెల్సియస్ డిగ్రీలు దాటుతోంది. నిన్న బుధవారం అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలోని ముగ్పాల్ మండలం మంచిప్పలో 42.2, నిజామాబాద్ లో 41.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా కామారెడ్డి జిల్లాలోని బిచ్కుందలో 40.9, తాడ్వాయిలో 39.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మున్ముందు ఎండలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోంది.
Similar News
News February 7, 2026
NZB: పోరు బరిలో బంధువులు, కుటుంబీకులు..

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో బంధువులు పోటీ పడుతున్నారు. ఒకే పార్టీ నుంచి భార్యా మరొకచోట నుంచి భర్త, ఒకే పార్టీ నుంచి తండ్రి ఒక చోట నుంచి కూతురు ఒక చోట, పక్కపక్కనే గల డివిజన్లో అన్నదమ్ముల కూతుర్లు అక్కాచెల్లెళ్లు కూడా ఒకే పార్టీ నుంచి పక్కపక్కనే గల డివిజన్ల నుంచి పోటీ చేస్తున్నటువంటి సన్నివేశం ఆసక్తికరంగా మారింది.
News February 7, 2026
NZB: ముఖ్యమంత్రి పర్యటనతో కాంగ్రెస్ అభ్యర్థుల్లో జోష్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నిజామాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ కార్పోరేటర్ అభ్యర్థుల్లో జోష్ నింపింది. సభకు ముందు CM పోటీ పడుతున్న అభ్యర్థులతో చిట్ చాట్ చేస్తూ అన్ని సర్వేలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయని గెలుస్తారని పేర్కొనడంతో వారికి గెలుపుపై ధీమా ఏర్పడింది. దాంతో మరింత ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు.
News February 7, 2026
NZB: ఎన్నికల్లో మహిళలే కీలకం: CM

నిజామాబాద్ కార్పొరేషన్లో సగం మంది మహిళా అభ్యర్థులు ఉన్నారని, ఎన్నికల్లో మహిళలే కీలకంగా మారనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థులతో సీఎం మాట్లాడారు. ఎన్నికల్లో మహిళలే కీలకంగా మారబోతున్నారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దాన్ని బట్టే విజయావకాశాలు ఉంటాయని హితవు పలికారు. అన్ని సర్వేలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నాయని వారికి వివారించారు


