News November 17, 2025

నిజామాబాద్ అమ్మాయికి ‘బాలరత్న-2025’ అవార్డు

image

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన తేలి విభశ్రీ ‘మల్టిపుల్ టాలెంట్ గర్ల్’, ‘బాలరత్న – 2025’ అవార్డులను అందుకుంది. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 6వ తరగతి చదువుతున్న విభ శ్రీ.. శాస్త్రీయ నృత్యం, వెస్ట్రన్, ఫోక్ పాటలు, పలు టీవీ షోలు, చలనచిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సినీనటి ట్వింకిల్ కపూర్ చేతుల మీదుగా ఈ బాలకళాకారిణి అవార్డును స్వీకరించింది.

Similar News

News January 17, 2026

పొగమంచు తీవ్రత.. ఉ.8 గంటల తర్వాతే బయటికి రావాలి!

image

AP: రాష్ట్రంలో రేపు ఉ.8 గంటల వరకు పొగమంచు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఏలూరు, తూ.గో, ప.గో జిల్లాల్లో తీవ్రత అధికంగా ఉంటుందని వెల్లడించింది. పండగకొచ్చి వాహనాల్లో తిరుగు ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. పూర్తిగా పొగమంచు తొలగిపోయాకే బయటికి రావాలంది. అటు TGలోనూ కొన్ని ప్రాంతాల్లో పొగమంచు వల్ల వాహన రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది.

News January 17, 2026

కొత్తగూడెం తొలి మేయర్ పీఠం ఆ వర్గానికే..

image

కొత్తగూడెం మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా మారిన తర్వాత తొలి ఎన్నికల్లో మేయర్ పీఠం ఎస్టీకి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో మెజారిటీ జనాభా ఏజెన్సీ వాసులు కావడంతో, జనాభా ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తొలిసారిగా ఒక గిరిజన బిడ్డ మేయర్ పీఠాన్ని అధిష్టించనున్నారు. ఏజెన్సీ ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేరడంతో గిరిజన సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

News January 17, 2026

BCCI అబ్జర్వర్‌గా కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ

image

ఈ నెల 21న నాగపూర్‌లో జరిగే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి టీ–20 మ్యాచ్‌కు BCCI అబ్జర్వర్‌గా కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ (KDCA) సెక్రటరీ ఎం. రవీంద్ర చౌదరి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆయనకు అభినందనలు తెలిపింది. గత 40 సంవత్సరాలుగా క్రికెట్‌కు అందిస్తున్న సేవలకు ఇది తగిన గుర్తింపుగా క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.