News March 6, 2025
నిజామాబాద్ జిల్లాలో వింత పరిస్థితి.. పగలు ఎండ.. రాత్రి చలి!

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నా.. రాత్రిళ్లు చలి వణికిస్తోంది. అనేక ప్రాంతాల్లో పగటి సమయంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కానీ రాత్రయ్యే సరికి చలి విరుచుకుపడుతోంది. దీంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాలోని సిరికొండ మండలం తూమ్పల్లిలో 9.3℃ డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వేసవిలో ఎండతో పాటు చలికి కూడా జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Similar News
News December 17, 2025
రియల్ లైఫ్ ‘జెర్సీ’ మూమెంట్!

మన కెరీర్ క్లోజ్ అనుకున్నప్పుడు లైఫ్ మరో ఛాన్స్ ఇస్తే ఆ ఫీలింగ్ను ‘జెర్సీ రైల్వే స్టేషన్ సీన్’ కంటే బాగా ఏదీ చెప్పలేదేమో. తాజా IPL వేలంలో అదే రిపీటైంది. యంగేజ్లోనే సచిన్, సెహ్వాగ్, లారాల కాంబోగా గుర్తింపు పొందిన <<18585528>>పృథ్వీషా<<>> ఆ తర్వాత వివాదాలు&ఫామ్ లేక కనుమరుగయ్యారు. టన్నుల కొద్ది డొమెస్టిక్ రన్స్ కొట్టినా సర్ఫరాజ్కు స్థానం దొరకలేదు. రీఎంట్రీ కష్టమనుకున్న సమయంలో వీరిని DC, CSK ఆదుకున్నాయి.
News December 17, 2025
సూర్యాపేట: @ ఒంటిగంట వరకు పోలింగ్ శాతం ఎంతంటే?

సూర్యాపేట జిల్లాలో నిర్వహించిన 3వ విడత ఎన్నిక పోలింగ్ శాతాన్ని అధికారులు వెల్లడించారు.
చింతలపాలెం – 82.59%
గరిడేపల్లి – 87.72%
హుజూర్నగర్ – 83.18%
మట్టంపల్లి – 88.97%
మేళ్లచెరువు – 85.08%
నేరేడుచర్ల – 86.14%
పాలకవీడు – 87.60%
జిల్లా వ్యాప్తంగా 86.19% నమోదైందన్నారు.
News December 17, 2025
నాగర్కర్నూల్ జిల్లాలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

జిల్లాలోని 7 మండలాల్లో గల 158 పంచాయతీలు, 1,364 వార్డు స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. అచ్చంపేట, లింగాల, అమ్రాబాద్ తదితర మండలాల్లో అధికారులు తొలుత వార్డు సభ్యుల ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం సర్పంచ్ ఫలితాలను వెల్లడించనున్నారు. మేజర్ పంచాయతీల ఫలితాలు వెలువడటానికి రాత్రి వరకు సమయం పట్టే అవకాశం ఉందని, అనంతరం ఉపసర్పంచుల ఎన్నిక ఉంటుందని అధికారులు తెలిపారు.


