News March 26, 2024

నిజామాబాద్: మట్టి కుండ.. సల్ల గుండ

image

వేసవిలో ప్రత్యేకంగా ఉపయోగించే మట్టి కుండలకు ట్యాప్‌ (నల్ల) ఏర్పాటు చేసి NZB జిల్లా కేంద్రంలో విక్రయిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిళ్లకు ఏ మాత్రం తగ్గకుండా ఈ కుండలు లభిస్తున్నాయి. వివిధ సైజులు, ఆకృతులను బట్టి విటి ధర నిర్ణయించబడి ఉంది. వేసవిలో పేదవాడి ఫ్రిజ్‌గా చెప్పుకునే వీటికి సౌత్ ఇండియాలోనే మంచి డిమాండ్ ఉంది. ఎర్రటి మట్టి కుండలోని చల్లటి నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు

Similar News

News February 15, 2026

NZB: ప్రత్యేక సమావేశం ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

నిజామాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న ప్రత్యేక సమావేశ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. నూతన కార్పొరేటర్లతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరవుతున్న నేపథ్యంలో, ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రత, ప్రొటోకాల్ విషయంలో జాగ్రత్తలు వహించాలని సూచించారు.

News February 15, 2026

NZB: యథావిధిగా ప్రజావాణి

image

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీ (సోమవారం) నుంచి యథావిధిగా ఉంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడం వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని గుర్తు చేశారు.

News February 15, 2026

NZB: ఆ ఐదుగురిలో మేయర్ ఎవరో?

image

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పదవిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి 17 మంది కార్పొరేటర్లు గెలువగా అందులో ఐదుగురు మహిళలున్నారు. వారిలో 21వ డివిజన్ నుంచి గెలుపొందిన పంచరెడ్డి లలిత, 49వ డివిజన్ ఉమారాణి, 12వ డివిజన్ దుమాలే అరుంధతి, 9వ డివిజన్ కేతావత్ సురేఖ, 41వ డివిజన్ పూజిత ప్రవీన్ గౌడ్‌లో ఒకరికి మేయర్ పదవి దక్కే అవకాశాలున్నాయి.