News November 19, 2025
నిజామాబాద్: 23 మందికి రూ.2.36 లక్షల జరిమానా

నిజామాబాద్ డివిజన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 30 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారిని మంగళవారం జిల్లా మార్నింగ్ కోర్టులో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపరిచారు. వారిలో 23 మందికి రూ.2.36 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చింది. మరో ఏడుగురికి జైలు శిక్ష పడింది. అంతకు ముందు వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు.
Similar News
News January 24, 2026
నిజామాబాద్: ఎన్నికల అధికారులకు శిక్షణ

నిజామాబాద్లోని కంటేశ్వర్ పాలిటెక్నిక్ కళాశాలలో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు మున్సిపల్ ఎన్నికలపై శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ అంకిత్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనలపై మాస్టర్ ట్రైనర్లు అధికారులకు సమగ్ర అవగాహన కల్పించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
News January 23, 2026
NZB: 24న జిల్లా స్థాయి సైక్లింగ్ ఎంపికలు

సిద్దిపేటలో జరగనున్న 10వ రాష్ట్రస్థాయి మౌంటెన్ బైక్ సైక్లింగ్ పోటీల కోసం జిల్లా జట్టు ఎంపికలు ఈ నెల 24న నిర్వహించనున్నట్లు కార్యదర్శి విజయ్ కాంతారావు తెలిపారు. కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో అండర్-14, 16, 18 విభాగాల్లో బాలురు, బాలికలకు ఎంపికలు ఉంటాయి. ఆసక్తి గల క్రీడాకారులు ఉదయం 8 గంటలకు రిపోర్ట్ చేయాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News January 23, 2026
NZB: అండమాన్కు అజాద్ హిందూ పేరు పెట్టాలని కవిత లేఖ

అండమాన్కు అజాద్ హిందూ పేరు పెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి NZB మాజీ MP, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత లేఖ రాశారు. జాగృతి కూడా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ల డిమాండ్ను సపోర్ట్ చేస్తోందన్నారు. తమకున్న నెట్వర్క్తో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ డిమాండ్ వచ్చేలా చేస్తామని లేఖలో పేర్కొన్నారు. అండమాన్ నికోబార్ పేరును బ్రిటీష్ వాళ్లు పెట్టారన్నారు.


