News September 13, 2025
నిధులతో జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి: ఎంపీ పుట్టా

కేంద్రం నుంచి విడుదలైన నిధులను సక్రమంగా వినియోగించి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని అధికారులకు ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన దిశ (జిల్లా అభివృద్ధి, సమన్వయ కమిటీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర నిధులతో జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిని అధికారులు ప్రజాప్రతినిధులకు వివరించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Similar News
News December 13, 2025
సైబర్ నేరగాళ్లపై కరీంనగర్ సీపీ ఉక్కుపాదం

టెక్నాలజీపై పట్టున్న కరీంనగర్ CP గౌస్ ఆలం ఆర్థిక నేరగాళ్లను వేటాడుతున్నారు. సైబర్ క్రైమ్ కంప్లైంట్ వచ్చిన వెంటనే కేసును చేధిస్తూ బాధితులలో భరోసా నింపుతున్నారు. ఇటీవల సంచలనం సృష్టించిన మేటా ఫండ్ కింగ్ పిన్ లోకేశ్వర్ను పట్టుకొని కటకటాల్లోకి పంపారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరంలో 281 సైబర్ కేసులు నమోదయ్యాయి. రూ.90,77,918 రికవరీ చేసి బాధితులకు అందించారు.
News December 13, 2025
బిగ్బాస్.. సుమన్ శెట్టి ఎలిమినేట్!

బిగ్ బాస్ తెలుగు సీజన్-9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉంది. సీజన్ ఇంకో వారమే మిగిలుంది కాబట్టి హౌస్లో ఉన్న ఏడుగురు సభ్యుల్లో ఇద్దరిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. శనివారం ఎపిసోడ్లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఆదివారం ఎపిసోడ్లో సంజన/భరణి/డెమోన్ పవన్లో ఒకరు ఎలిమినేటయ్యే ఛాన్సులున్నాయని SMలో పోస్టులు వైరలవుతున్నాయి.
News December 13, 2025
రాజయ్యపేట: ‘బల్క్ డ్రగ్ పార్క్కు అంగీకరించే ప్రసక్తే లేదు’

సీఎం చంద్రబాబుతో ఈనెల 16వ తేదీన భేటీ అయ్యే మత్స్యకార ప్రతినిధులు శనివారం నక్కపల్లి మండలం రాజయ్యపేటలో సమావేశం అయ్యారు. బల్క్ డ్రగ్ పార్క్కు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని వారు నిర్ణయం తీసుకున్నారు. బొమ్మల పరిశ్రమ, షుగర్ ఫ్యాక్టరీలు లాంటి ప్రజలకు హాని కలగని పరిశ్రమల ఏర్పాటుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని వారు పేర్కొన్నారు. సీఎంతో మాట్లాడే అంశాలపై మత్స్యకార నాయకులు చర్చించారు.


