News February 1, 2025
నిర్మల్లో తప్పిపోయి మెట్పెల్లిలో కనిపించాడు

నిర్మల్లో వ్యక్తి తప్పిపోయి మెట్పెల్లిలో కనిపించిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ADBజిల్లా బోథ్కు చెందిన అబ్దుల్ మాజీద్ (40) గురువారం నిర్మల్లో ఓ శుభకార్యంలో పాల్గొన్నారు. ప్రార్థనల కోసమని బంధువుల ఇంటి నుంచి వెళ్లిన ఆయన కనిపించంలేదు. కుటుంబీకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా శుక్రవారం ఆయన జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఉన్నట్లు తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News February 8, 2025
కొందరు వెన్నుపోటు పొడిచారు: తమన్

తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నా కెరీర్లో నేను ఎంతోమందిని నమ్మి మోసపోయా. వారు నాకు వెన్నుపోటు పొడిచారు. నా ఎదుట మంచిగా ఉండి.. పక్కకు వెళ్లగానే నా గురించి చెత్తగా మాట్లాడేవారు. కొందరిని నమ్మి ఎంతో డబ్బు పోగొట్టుకున్నా. వీటన్నిటి నుంచి జీవిత పాఠాలు నేర్చుకున్నా. ఎప్పుడైనా ఒత్తిడికి గురైతే వెంటనే గ్రౌండ్కు వెళ్లి క్రికెట్ ఆడతా’ అని చెప్పుకొచ్చారు.
News February 8, 2025
అరవింద్ కేజ్రీవాల్ను ఓడించిన ఓ కొడుకు పగ!

కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్టుగా న్యూఢిల్లీ సీట్లో అరవింద్ కేజ్రీవాల్ ఓటమికి ఓ కొడుకు పగ తోడైంది. 1998, 2003, 2008లో ఇక్కడ Ex CM షీలా దీక్షిత్ హ్యాట్రిక్ కొట్టారు. 2013లో ఆమెను ఓడించి AK CM అయ్యారు. ఇక్కడ 3 సార్లు గెలిచిన ఆయన ఈసారి 4089 ఓట్లతో ఓడారు. షీలా కొడుకు సందీప్ దీక్షిత్ (INC)కు ఇక్కడ వచ్చిన ఓట్లు 4568. వీటిని చీల్చకపోతే AKదే విజయం. ఇలా తన తల్లి ఓటమికి ఆయన ప్రతీకారం తీర్చుకున్నారు.
News February 8, 2025
సంచలన వ్యాఖ్యలు.. కేజ్రీవాల్ సీఎం అవుతారు

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్పై పంజాబ్ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఓటమితో డీలా పడ్డ కేజ్రీవాల్ త్వరలోనే పంజాబ్ సీఎం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తారని వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుత సీఎం భగవంత్ మాన్ను కేజ్రీవాల్ రీప్లేస్ చేసే అవకాశం ఉంది. పంజాబ్కు హిందూ వ్యక్తి సీఎం అవుతారని రాష్ట్ర AAP అధ్యక్షుడు అమన్ అరోరా కూడా ఇటీవల అన్నారు’ అని బజ్వా గుర్తుచేశారు.