News August 11, 2025

నిర్మల్: రూ.29 కోట్ల బియ్యం గుటుక్కు

image

ముధోల్(M) ముద్గల్‌లోని 2 రైస్ మిల్లులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏషియన్, గణపతి రైస్‌మిల్లులు 2024-25లో సేకరించిన 7,111.448 మె.టల ధాన్యాన్ని CMR ప్రభుత్వానికి ఇవ్వలేదు. అధికారులు తనిఖీ చేసినప్పుడు బియ్యం నిల్వలు కనిపించలేదు. దీనిపై సివిల్ సప్లై DM సుధాకర్ ఫిర్యాదు చేయగా.. మిల్లుల యజమానులు మషరుద్దీన్, శ్రీనివాస్‌‌పై కేసులు నమోదు చేశారు. రూ.29 కోట్ల విలువైన బియ్యం దుర్వినియోగం జరిగినట్లు సమాచారం.

Similar News

News March 13, 2026

సంగారెడ్డి జిల్లాలో సిలిండర్ల కొరత సృష్టిస్తే చర్యలు: కలెక్టర్

image

సంగారెడ్డి జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ప్రావీణ్య హెచ్చరించారు. ఎస్పీ పరితోష్ పంకజ్‌తో కలిసి సమీక్షించారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దన్నారు. పట్టణాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజులకు ఒకసారి బుక్ చేసుకునే వీలుందని తెలిపారు. తప్పుడు వార్తలు వ్యాప్తి చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

News March 13, 2026

VKB: పది పరీక్షలకు పకడ్బందీ పోలీస్ బందోబస్తు

image

వికారాబాద్ జిల్లాలో శనివారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 69 పరీక్షా కేంద్రాల వద్ద పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు సెక్షన్ 163 అమలులో ఉంటుందని వెల్లడించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతరం నిఘా ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు.

News March 13, 2026

రూటు మార్చిన పవన్.. ఆదివాసీల మధ్య వేడుకలు

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14న స్థాపించిన జనసేన పార్టీ రేపటితో 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ ఏడాదిలోకి అడుగుపెడుతోంది. ఈసారి వేడుకలను తొలుత పిఠాపురంలో నిర్వహించాలని భావించినప్పటికీ, వివిధ కారణాలతో రద్దు చేశారు. అనంతరం ASR జిల్లా పాడేరు సమీప నందిగురువులో కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టారు. ‘మాటా-మంతి’ కార్యక్రమంలో గిరిజనులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నారు.